భూత్పూర్, నవంబర్ 15 : అన్నివర్గాల సంక్షేమానికి సీఎం కేసీఆర్ కృషి చేశారని, కులవృత్తులతో ఆర్థికసాయం అందించి అండగా నిలిచారని దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి తెలిపారు. బుధవారం భూత్పూర్లోని కేవీఎన్ ఫంక్షన్హాల్లో ముదిరాజ్ల చేరిక కార్యక్రమాన్ని మున్సిపల్ చైర్మన్ సత్తూర్ బస్వరాజ్గౌడ్ అధ్యక్షతన నిర్వహించారు. ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి సమక్షంలో 300మంది ముదిరాజ్లు, 150మంది మందుల కులస్తులు చేరారు. సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అన్ని కులాలు, మతాలకు సీఎం కేసీఆర్ సమాన ప్రాధాన్యతను ఇస్తున్నారన్నారు. అందులో భాగంగానే కులవృత్తులకు ప్రాత్సాహం అందించి అండగా నిలిచినట్లు తెలిపారు. వివిధ వృత్తుల వారికి ఆర్థికసాయం అందించడంతోపాటు బీమా కల్పించినట్లు వెల్లడించారు. పదేండ్లలో ఎంతో అభివృద్ధి చేశామని, మరోసారి ఆశీర్వదిస్తే మరింత అభివృద్ధి చేస్తామన్నారు.
అనంతరం మాజీ ఎమ్మెల్యే ఎర్రశేఖర్ మాట్లాడుతూ ముదిరాజ్లు బీఆర్ఎస్ పార్టీ విజయం కోసం కృషి చేయాలని కోరారు. ముఖ్యంగా దేవరకద్ర ఎమ్మెల్యే అభ్యర్థి ఆల వెంకటేశ్వర్రెడ్డి పెద్ద మెజార్టీతో గెలిపించాలని కోరారు. కరివెనకు పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును సాధించిన ఘనత ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డిదేనని అన్నారు. కరివెన ప్రాజెక్టు పనులు పూర్తయితే చుట్టుపక్కల గ్రామాల ముదిరాజ్లకు చేపల పెంపకానికి ఎంతో ప్రోత్సాహం లభిస్తుందన్నారు. ఇప్పటికే సీఎం కేసీఆర్ ప్రభుత్వం ఉచిత చేపపిల్లల పంపిణీ, వలలు, వాహనాలు అందించి ఆర్థికంగా ఎదిగేందుకు ప్రోత్సాహం అందిస్తున్నారన్నారు. మరోసారి బీఆర్ఎస్ను ఆదరిస్తే మరింత అభివృద్ధికి ఆస్కారం ఉంటుందని తెలిపారు. కరివెన ప్రాజెక్టులో ఒక్కసారి కోటి చేప పిల్లలను వదలవచ్చని, దీనిద్వారా ఏడాదికి రూ.100కోట్ల వ్యాపారం జరుగుతుందని తెలిపారు. అనంతరం బీజేపీ నాయకులు మల్లేశ్, వెంకట్రాజుతోపాటు 300మంది, అదేవిధంగా మందుల కులస్తులు 150మంది ఎమ్మెల్యే ఆల, మాజీ ఎమ్మెల్యే ఎర్రశేఖర్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. కార్యక్రమంలో ఎంపీపీ కదిరె శేఖర్రెడ్డి, సింగిల్విండో చైర్మన్ అశోక్రెడ్డి, ముదిరాజ్ సంఘం నాయకులు మనెమోని సత్యనారాయణ, గోప్లాపూర్ సత్యనారాయణ, సాయిలు, బాలస్వామి, వెంకటయ్య, శేఖర్, బీఆర్ఎస్ నాయకులు సత్తూర్ నారాయణగౌడ్, మురళీధర్గౌడ్, అహ్మద్, యాసిన్, నర్సింహులు తదితరులు పాల్గొన్నారు.
మండలంలోని వెల్కిచర్ల శివారులో ఎమ్మెల్యే, బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఆల వెంకటేశ్వర్రెడ్డి బుధవారం ప్రచారానికి వెళ్తుండగా అధికారులు వాహనాన్ని నిలిపి తనిఖీ చేశారు. తనిఖీల్లో ఏమీ దొరకకపోవడతో ఎమ్మెల్యే అక్కడి నుంచి బయలుదేరి వెళ్లారు.