మహబూబ్నగర్టౌన్, జనవరి 8: పేదలకు సాయం అందించాలన్న తపన..ఆపదలో ఉన్న వారికి మేమున్నమంటూ భరోసా ఇస్తున్నాడు మోమిన్నగర్కు చెందిన జహంగీర్బాబా, అతడి మిత్రులు. నిరుపేదలకు సేవలు చేయాలనే ఉద్దేశంతో 2006 ఆల్ఫైజ్ వెల్ఫేర్ సొసైటీని స్థాపించారు. సొసైటీ అధ్యక్షుడిగా జహంగీర్బాబా ఉంటూ ప్రారంభం నుంచి అనేక సేవ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. 2010లో అలంపూర్, శాంతినగర్లలో వరదలు వచ్చినప్పుడు తమ వంతు సాయంగా నిత్యావసర సరుకులు పంపి ణీ చేశారు. పేద విద్యార్థులకు ఉచితంగా స్టడీ మెటీరియల్ పంపిణీ, పోలియో టీకా కార్యక్రమంలో స్వచ్ఛందంగా పాల్గొని తమ వంతు సహకారం అందిస్తున్నారు. నిరుపేద యువతుల వి వాహాలకు తమకు తోచిన ఆర్థిక సాయం అందజేస్తు అందరి మన్ననలు అందుకుంటున్నారు. ఓటరు నమోదు కార్యక్రమాల్లో పాల్గొని ఉచితంగా ఆన్లైన్లో ఓటు నమోదు చేశారు.
ప్రభుత్వ పథకాలపై అవగాహన
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమా పథకలపై ప్రజలకు అగాగహన కార్యక్రమాలు నిర్వహించారు. పథకాలకు సంబంధించి టేబు ల్ క్యాలెండర్ను రూపొందించి ప్రతి ఏడాది ఆవిష్కరిస్తున్నారు. అర్హులు లబ్ధి పొందేలా ఆయా పథకాలను ప్రజలకు వివరిస్తున్నారు. కరోనా వైరస్ నేపథ్యంలో పేదలకు బ్రెడ్లు, పండ్లు పంపిణీ చేశారు.
పేదలకు సాయం చేయాలనే..
మా అమ్మ ఎప్పడైనా ఎవరైనా ఆపదలో ఉంటే మనవంతు సా యం చేయాలనే చె ప్పింది. అమ్మ మా ట ప్రకారం సామాజిక సేవా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాను. తెలంగాణ రాష్ట్ర ం ఏర్పడిన తరువాత సీఎం కేసీఆర్ పేదల అభ్యున్నతే ధ్యేయంగా ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారు. పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించడానికి పథకాలతో టేబుల్ క్యాలెండర్ రూపొందిస్తున్నాం.
-జహంగీర్బాబా, ఆల్ఫైజ్ వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షుడు