అలంపూర్: అనారోగ్యంతో దవాఖానాకు వచ్చే రోగులకు మెరుగైన వైద్యం అందించి ప్రభుత్వ ఆసుపత్రులపై భరోసా పెంచాలని అలంపూర్ మున్సిపల్ చైర్ పర్సన్ మనోరమ వెంకటేష్ అన్నారు. బుధవారం ఆమె పట్టణంలోని ప్రభుత్వ దవాఖాను సందర్శించారు. అక్కడ రోగులకు అందే వైద్యం గురించి అడిగి తెలుసుకున్నారు. సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలన్నారు. దవాఖానాలో ఉన్న సమస్యలను వైద్యులు చైర్ పర్సన్ దృష్టికి తీసుకురాగ… ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి పరిష్కరించేందుకు కృషి చేస్తామన్నారు. ఈ సందర్భంగా వైద్యులు రమ్య, లక్ష్మన్న, మున్సిపల్ కౌన్సిలర్ జయలక్ష్మీ, తదితరులు ఉన్నారు.