అయిజ, మార్చి 3 : పట్టణంలోని తిక్కవీరేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అంతర్రాష్ట్ర కబడ్డీ పోటీలు నిర్వహించడం అభినందనీయమని అలంపూర్ ఎమ్మెల్యే వి జయుడు అన్నారు. ఆదివారం ఆలయ ప్రాంగణంలో బ్రహ్మోత్సవాల సందర్భంగా నిర్వహిస్తున్న ఓపెన్ కబడ్డీ పోటీలను ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ క్రీడలు మానసికోల్లాసం కలిగిస్తాయన్నారు.
క్రీడాకారులు సమయస్ఫూర్తితో మెలుగుతూ ఆటల్లో గెలుపొందాలన్నారు. ఓటమి గెలుపునకు నాంది అని, క్రీడల్లో గెలుపోటములు సహజమన్నారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో పోటీలు పెద్ద ఎ త్తున నిర్వహించడం సంతోషకరమన్నారు. క్రీడలకు తె లంగాణ, ఏపీ, కర్ణాటక రాష్ర్టాలకు చెందిన 34జట్లు త రలిరావడం అభినందనీయమన్నారు. అంతకుముం దు తిక్కవీరేశ్వరస్వామి కి ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఎమ్మెల్యేను శేషవస్త్రంతో సన్మానించారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, బీఆర్ఎస్ శ్రేణులు పాల్గొన్నారు.