నారాయణపేట టౌన్, ఫిబ్రవరి 14 : ప్రజలు డిజిటల్ లావాదేవీలపై అప్రమత్తంగా ఉండాలని అదనపు కలెక్టర్ మయాంక్ మిట్టల్ అన్నారు. ఆర్థిక అక్షరాస్యత వారోత్సవా ల్లో భాగంగా మంగళవారం లీడ్ బ్యాంక్ ఆధ్వర్యంలో పట్టణంలోని మినీ స్టేడియం నుంచి అంబేద్కర్ చౌరస్తా వరకు నిర్వహించిన ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈనెల 17వ తేదీ వర కు జిల్లాలో ఆర్థిక అక్షరాస్యత క్యాంప్లు నిర్వహించి సైబర్ నేరాలు, యాప్ల నుంచి తీసుకునే రుణాల జాగ్రత్తలపై ప్ర జలకు అవగాహన కల్పిస్తామని పేర్కొన్నారు. సరైన ఆర్థిక వ్యవహారాలే ప్రజలను మోసపోకుండా కాపాడుతాయన్నా రు. ఓటీపీ, సీవీపీ నెంబర్లు, బ్యాంక్ ఖాతా వివరాలను ఇతరులతో పంచుకోరాదన్నారు. ఆర్థిక క్రమశిక్షణ, పొదుపు, డిజిటల్ లావాదేవీలు చేసే సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. కార్యక్రమంలో ఆర్డీవో రాంచందర్ నాయక్, ఎల్డీఎం విజయ్కుమార్, జెడ్పీ సీఈవో జ్యోతి, మున్సిపల్ కమిషనర్ సునీత, వివిధ బ్యాంకుల మేనేజర్లు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
సమస్యలు పరిష్కార దిశగా చర్యలు
జిల్లాలో భూ సేకరణకు సంబంధించి కోర్టు కేసులు, ఇతర సమస్య లు త్వరగా పరిష్కారం అయ్యేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ శ్రీ హర్ష అధికారులను ఆదేశించారు. పట్టణంలోని కలెక్టర్ కార్యాలయం లో భూ సేకరణకు సంబంధించిన పెండింగ్ కేసులు, కోర్టు కేసుల పరిష్కారానికి తీసుకున్న చర్యలపై మంగళవారం స మీక్షించారు. ఏజీపీతో త్వరగా మాట్లాడడం, అవార్డు విషయంలో ఫైనాన్స్లో పెండింగ్ ఉంటే త్వరగా పరిష్కరించుకోవాలన్నారు. జాతీయ రహదారి, ఇరిగేషన్కు సంబంధిం చి భూ సేకరణ విషయం కోర్టులో పెండింగ్లో ఉన్న కారణంగా త్వరగా భూ సేకరణ చేయలేకపోతున్నామని అధికారులు తెలుపగా, ప్రత్యేక శ్రద్ధ తీసుకొని పరిష్కరించాలని ఆర్డీవో రాంచందర్నాయక్ను ఆదేశించారు. కార్యక్రమం లో అదనపు కలెక్టర్ మయాంక్ మిట్టల్, విశ్రాంత తాసిల్దార్ మల్లికార్జున్, డిప్యూటీ తాసిల్దార్ రవీందర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.