అచ్చంపేట, ఫిబ్రవరి 11 : అచ్చంపేట వ్యవసాయ మార్కెట్యార్డులో ఆదివారం మరోసారి వేరుశనగ రైతుల ఆగ్రహం కట్టలు తెంచుకున్నది. పల్లికి ట్రేడర్లు గి ట్టుబాటు ధర కల్పించాలని డి మాండ్ చేస్తూ ఆందోళన చేపట్టా రు. అచ్చంపేట మార్కెట్కు ఆదివారం 709మంది రైతులు 32, 875 బస్తాల (8,218.75 క్విం టాళ్లు) వేరుశనగ తీసుకొచ్చారు. కాగా ధర క్వింటాకు గరిష్ఠంగా రూ.7,060, కనిష్ఠంగా రూ. 4,816, మధ్యస్తంగా రూ. 6,510గా నిర్ణయించా రు. ఈ ధరలను చూసిన రైతులు ఆగ్రహంతో ఊగిపోయా రు. ట్రేడర్లు కుమ్మక్కై తక్కువ ధర నిర్ణయిస్తున్నారని, శాంపిల్ తీసుకెళ్లకుండా చేతులతో చూసి ధర నిర్ణయిస్తున్నారని ఆరోపించారు. రైతులను అడుగడుగునా మోసం చేస్తున్నారంటూ సెక్రటరీ కార్యాలయాన్ని చుట్టుముట్టి గిట్టుబాటు ధర కల్పించాలని నినాదాలు చేశారు.
మార్కెట్కమిటీ చైర్పర్సన్ చాంబర్లోకి చొరబడి ఫర్నిచర్ను ధ్వంసం చేశారు. తలుపు అద్దాలు పగులగొట్టి, కుర్చీలు, టేబుల్ను కిందపడేశారు. చైర్పర్సన్ అరుణను కొందరు మహిళా రైతులు చీరపట్టి లాగి, కింద కూర్చున్న ఆమెపై దాడికి పాల్పడ్డారు. మార్కెట్ నుంచి చైర్పర్సన్ చీర పట్టుకొని అంబేద్కర్ చౌరస్తా వరకు లాక్కొని వచ్చారు. చౌరస్తా వద్ద చైర్పర్సన్ను నిర్బంధించి ఆమె తలపై వేరుశనగ పోసి ఆందోళన చేపట్టగా సాయం త్రం వరకు ఆందోళన కొనసాగింది. ప్రభుత్వం వేరుశనగ పంటకు గిట్టుబాటు ధర ఇవ్వకుండా తమకు అన్యాయం చే స్తున్నదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ నోట్లో మ ట్టికొడుతున్న ట్రేడర్లు, అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. చివరకు ఎస్సై, పోలీసులు జోక్యం చేసుకొని రీ టెండర్లు వేయిస్తామని చెప్పడంతో రైతులు ఆందోళన విరమించారు. కాగా, చైర్పర్సన్పై జరిగిన దాడిని పలువురు ఖండించారు. చైర్పర్సన్పై కొందరు రైతులు కావాలనే దాడికి పాల్పడ్డారని బీఆర్ఎస్ యువజన విభాగం రాష్ర్ట నాయకుడు ప్రవీణ్ పేర్కొన్నారు. రైతులే దాడి చేశారా? లేక వారిని రెచ్చగొట్టి దాడి చేయించారా? అనే విషయాన్ని పోలీసులు విచారణ చేసి తెలుసుకోవాలని కోరారు.
తనపై దాడి చేసి భయాందోళకు గురిచేసిన వా రిపై చర్యలు తీసుకోవాలని చైర్పర్సన్ అరుణ అ చ్చంపేట పీఎస్లో ఫిర్యాదు చేశారు. ధరల గురించి మార్కెట్ సెక్రటరీ, ట్రేడర్లు చూసుకోవాలి కానీ.. తనను నిర్బంధించి దాడిచేయడం సరైంది కాదన్నా రు. ధరలతో తనకు సంబంధం ఉండదని, ట్రేడర్లతో అందరం కలిసి మరోసారి మాట్లాడుదామని చెబుతున్నా వినకుండా దాడికి పాల్పడ్డారని పేర్కొన్నారు. చైర్పర్సన్పై దాడిని ఆర్యవైశ్య సంఘం, కి రాణా వ్యాపారస్తులు ఖండించారు. దాడికి నిరసన గా సోమవారం మార్కెట్ బంద్ చేస్తున్నట్లు వ్యాపారస్తులు తెలిపారు.