అలంపూర్, జూలై 13 : వాణిజ్య పంటలతో అధిక లాభాలు సాధించవచ్చని కొందరు రైతులు చేసి నిరూపిస్తున్నారు. ఉండవల్లి మండలం మెన్నిపాడు శివారులో తుంగభద్రానది తీరంలో ఆంధ్ర ప్రాంతానికి చెందిన ఓ రైతు తన 40ఎకరాల భూమిలో లెమన్గ్రాస్ పంట సాగు చేశాడు. తక్కువ మంది కూలీ లు, పెట్టుబడితో అధికఆదాయంతో నాలుగేండ్లుగా లెమన్గ్రాస్ పంటసాగు చేస్త్తున్నారు.
ఏడాదిలో ఆరు కోతలు..
లెమన్గ్రాస్ విత్తనాలు భూమిలో వేసిన త ర్వాత రెండు నెలల్లో గడ్డి పెరిగి కోతకు వస్త్తుంది. ఆవిధంగా కోతకు వచ్చిన గడ్డిని కోసి ఒకరోజు ఎండబెట్టి ఆయిల్ తీసేందుకు ఉపయోగిస్తారు. ఏడాది కాలంలో సుమారుగా ఐదు నుంచి ఆరు కోతలు కోసే అవకాశం ఉంటుంది.
బాయిలర్లో వేసి.. నూనె తీసి..
పొలంలో కోసి ఎండబెట్టిన గడ్డిని మరుసటి రోజు ఒక ప్రత్యేకమైన డ్రమ్ములో ఉంచి మూత పెట్టి బిగిస్తారు. అనంతరం బాయిల ర్ ద్వారా వచ్చిన వేడిని గొట్టం నుంచి డ్ర మ్ములోకి వదులుతారు. వేడికి గడ్డిలో నుంచి నీరు, ఆయిల్ బయటకు వస్తుంది. బయటకు వచ్చే నీటి నుంచి ఆయిల్ను వేరు చేయడానికి ప్రత్యేకమైన చిన్న, చిన్న బాక్స్లు, గొట్టాలు ఏర్పాటు ఉంటుంది. గొట్టాల ద్వారా బయటకు వచ్చిన ఆయిల్ను క్యాన్లలో ప్యాక్ చేసి మార్కెట్కు తరలిస్తారు.
కాస్మోటిక్స్లో ఆయిల్ వాడకం..
లెమన్ గ్రాస్ ఆయిల్ను సబ్బులు, ఆయింట్మెంట్స్, కాస్మోటిక్స్, సెంట్లు తయారీలలో వాడతారు. తెలంగాణ నుంచి ఏపీలోని తిరుపతి, విజయవాడ తదితర ప్రాంతాలకు ఎక్స్పోర్టు చేస్తారు.
మొదళ్ల నుంచి మొలకలు..
మొదటిసారి విత్తనం నాటిన తర్వాత కొత కోసిన ప్రతి విత్తనం నాటాల్సిన అవసరం లేదు. కోసిన తర్వాత వాటి మొదళ్ల నుంచి తిరిగి మొలకలు వస్తాయి. రెండు నెలల్లోపే కోతకు వస్తుంది. అదేవిధంగా విత్తనం నాటకపోయినా రీసైక్లింగ్ పద్ధ్దతిలో మొదళ్ల నుంచి మొలకలు వస్తూనే ఉంటాయి. కోతకు, కోతకు మధ్యకాలంలో మొదళ్లను కాల్చడం ద్వారా పొలానికి బూడిద రూపంలో ఎరువు లభ్యమవుతుంది.
ఎకరానికి 15లీటర్ల ఆయిల్..
ఎకరం లెమన్గ్రాస్ నుంచి సుమారుగా 15 నుంచి 20లీటర్ల ఆయిల్ ఉత్పత్తి అవుతుం ది. ఒక్కో లీటర్ ఆయిల్ మార్కెట్లో రూ.2 వేల వరకు ఉంటుంది. ఎకరం పంట సాగు కు పెట్టుబడి సుమారుగా రూ.20వేల వరకు అవుతుంది. ఉత్పత్తి అయిన ఆయిల్ను మా ర్కెట్లో విక్రయిస్తే సుమారుగా రూ.50 వేల వరకు ఆదాయం వస్తుంది. ఖర్చులు పోను ఎకరానికి సుమారుగా రూ.30వేల వరకు మిగులుబాటు అవుతుంది.