అచ్చంపేట, మే 21: నియోజకవర్గంలోని పేదలు, గిరిజనులు, దళితులకు మెరుగైన వైద్యసేవలు అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే గువ్వల బాలరాజు 2015లో వందపడకల దవాఖానను మంజూరు చేయించారు. అప్పట్లో రాష్ట్రవ్యాప్తంగా మూడు వంద పడకల దవాఖానలు మంజూరైతే అందులో నల్లమల ప్రాంతానికి సీఎం కేసీఆర్ తో మాట్లాడి ఓ దవాఖానను గువ్వ ల మంజూరు చేయించారు. కాగా అప్పటి వైద్య, ఆరోగ్యశాఖ మం త్రి లక్ష్మారెడ్డి చేతులమీదుగా పనులను ప్రారంభించారు. భవనం పూర్తయి ఏడాది కా గా సరైన వసతులు, డాక్టర్లు నియా మకానికి ఆలస్య మైంది. దవాఖానలో నేడు అన్ని వసతులు, పరికరాలతోపాటు డయాలసిస్ సెంటర్ కూడా అందుబా టులోకి వచ్చేసింది. కాగా డాక్టర్లు, సిబ్బంది నియామక ప్రక్రియ కొనసాగుతున్నది. అ న్ని హంగులతో వం ద పడక ల దవాఖాన ను 29వ తేదీన ఆర్థిక, వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్రావు ప్రారంభించనున్నారు. ఈ దవాఖాన ఏర్పాటుతో అచ్చంపేట ప్రజలకు మెరుగైన వైద్యం అందుబాటులోకి రానున్నది. అత్యవసర సమయంలో హైదరాబాద్, మహబూబ్నగర్ వంటి ప్రాంతాలకు వెళ్లాల్సిన పని ఉండదు.
డబుల్ ఇండ్ల పంపిణీ
అచ్చంపేటలో నిర్మించిన డబుల్బెడ్రూం ఇండ్లను 29న మంత్రి హరీశ్రావు ప్రారంభించనున్నారు. పట్టణంలో గూడు లేని పేదలకు సొంతింటి కల నెరవేర్చేందుకు డబుల్బెడ్రూంలను నిర్మించారు. అచ్చంపేట మున్సిపల్ పరిధిలో 250 ఇండ్లు మంజూరు కాగా మొదటి విడుతగా 150 ఇండ్లను నిర్మించారు. పట్టణంలోని రాజీవ్నగర్ కాలనీ వెనుకభాగంలో బ్లాకులుగా విభజించి 150 ఇండ్లు నిర్మించారు. మిగిలిన వంద ఇండ్ల నిర్మాణాలు చేపట్టాల్సి ఉన్నది. లబ్ధిదారుల ఎంపికలో ప్రజాప్రతినిధుల జోక్యం లేకుండా అధికారులే పారదర్శకంగా లక్కీడిప్ ద్వారా ఇండ్లను కేటాయించారు. మీసేవ ద్వారా వచ్చిన దరఖాస్తులను సర్వే చేసి అందులో అర్హులైన 291మంది జాబితాను రూపొందించి లక్కీడిప్ ద్వారా 150మందికి ఇండ్లు కేటాయించారు.
అందులో ఎస్సీలకు 26 ఇండ్లు, ఎస్టీలకు 9, మైనార్టీలకు 18, బీసీ ఇతరులను 97 ఇండ్లు కేటాయించారు. డబుల్ ఇండ్ల పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేసి ఎప్పటికప్పుడు పర్యవేక్షించారు. కాంట్రాక్టర్లను ఆదేశించి పనులు నాణ్యతగా, త్వరితగతిన పూర్తిచేయించారు. ఇండ్ల నిర్మాణాలపై ఉన్నతాధికారులు, గుత్తేదారులతో పలుమార్లు సమీక్షలు నిర్వహించారు. అన్ని వసతులతో డబుల్బెడ్రూం ఇండ్లు అందించేందుకు ఎమ్మెల్యే చర్యలు చేపట్టారు. లబ్ధిదారులకు కేటాయించిన ఇండ్లను మంత్రి హరీశ్రావు చేతులమీదుగా అందించనున్నారు. దీంతో లబ్ధిదారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. పేదల కలను సాకరం చేస్తున్న సీఎం కేసీఆర్, ఎమ్మెల్యే గువ్వల బాలరాజు సల్లగా ఉండాలని పేదలు
దీవిస్తున్నారు.