పాలమూరు/హన్వాడ, సెప్టెంబర్ 20 : జాతీయస్థాయి ఇన్స్పైర్ మనక్ పోటీల్లో దేశంలోనే ఏడోస్థానంలో నిలిచిన హన్వాడ జ్యోతిభాపూలే గురుకుల పాఠశాల విద్యార్థిని తా టి భావనను ఎక్సైజ్శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ సన్మానించారు. మంగళవారం మంత్రి గురుకుల పాఠశాలకు వెళ్లి భా వనను అభినందించారు. అలాగే చిత్రలేఖనంలో ఉత్తమ ప్రతిభ కనబర్చిన వైష్ణవిని మంత్రి సన్మానించారు.
భావన లైటింగ్ మ్యాన్క్యాప్ పేరిట చేసిన ప్రాజెక్టుకు గానూ జాతీయస్థాయిలో ఏడోస్థానంలో నిలిచిందని, సైంటిఫిక్ ఎక్స్ంజ్లో భాగంగా వచ్చే ఏడాది మార్చిలో జపాన్లో జరిగే కా ర్యక్రమానికి వెళ్లడం గర్వకారణమని మంత్రి పేర్కొన్నారు. ప్రభుత్వ గురుకుల విద్యాలయల్లో ఉన్నతవిద్యతోపాటు సృజనాత్మకతను పెంపొందిస్తున్నారని, అందుకు జాతీయస్థా యిలో గుర్తింపు పొందిన భావన ఉదాహరణ అన్నారు. హన్వాడలో బాల్యవివాహాలు అధికంగా ఉన్నందున సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి వాటిని రూపుమాపేందుకు ఇక్కడే బాలికల గురుకుల పాఠశాల ఏర్పాటు చేసినట్లు మంత్రి తెలిపారు. విద్యార్థులు నిర్వహించిన వివిధ సాంస్కృతిక ప్రదర్శనలు పలువురిని ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో డీఈవో రవీందర్, గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ స్వర్ణలత, విద్యార్థులు, అధికారులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.