వనపర్తి, జనవరి 20 : శ్రీరంగాపూర్ మండలం తాటిపాములకు చెందిన 30మంది నాయకులు శుక్రవారం వనపర్తి క్యాంప్ కార్యాలయంలో మంత్రి నిరంజన్రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. వార్డుసభ్యులు గంధం రమేశ్, బండారు వెం కటయ్య, సురేశ్, ఈరపాగ రాముడుతోపాటు మరో 25మంది నాయకులు బీఆర్ఎస్లో చేరగా, కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ నాడు రాష్ట్రం కోసం టీఆర్ఎస్.. నేడు దేశం కోసం బీఆర్ఎస్ ఆవిర్భవించిందని తెలిపారు. పట్టుదలకు మారుపేరు ప్రగతి సారథి, సీఎం కేసీఆర్ అన్నారు. ఆయన తలచుకుంటే ఏదైనా సాధిస్తారని, బీఆర్ఎస్ ఏర్పాటుతో దేశ రాజకీయాల్లో పెను మార్పులు చోటుచేసుకుంటున్నాయని చెప్పారు. అభివృద్ధి చేస్తామని కేంద్రంలో అధికారంలోకి వచ్చిన బీజేపీ దేశా న్ని అన్ని రంగాల్లో భ్రష్టు పట్టిస్తుందని ధ్వజమెత్తారు.
కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ గట్టుయాదవ్, వైస్చైర్మన్ వాకిటి శ్రీధర్, బీఆర్ఎస్ పార్టీ శిక్షణాతరగతుల జిల్లా అధ్యక్షుడు పురుషోత్తంరెడ్డి, కౌన్సిలర్లు లక్ష్మీనారాయణ, రాఘవేంద్ర, నాయకులు దాడి యోగానందరెడ్డి, మురళీసాగర్, బీచుపల్లియాదవ్ తదితరులు పాల్గొన్నారు.