మహబూబ్నగర్, సెప్టెంబర్ 27 : పాలమూరు జిల్లా పర్యాటక కేంద్రాలకు నిలయంగా మారిందని కలెక్టర్ వెంకట్రావు అన్నారు. సోమవారం జిల్లాకేంద్రం సమీపంలోని కేసీఆర్ ఏకో అర్బన్ పార్కులో ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడు తూ తక్కువ సమయంలోనే కేసీఆర్ ఏకో అర్బన్ పార్కును సుందరంగా తీర్చిదిద్దుకోవడం సంతోషంగా ఉందన్నారు. 2087 ఎకరాల్లో ఉన్న పార్కు దేశంలోనే అతిపెద్దదని తెలిపారు. అలాగే వందల సంవత్సరాల చరిత్ర కల్గిన పిల్లలమ ర్రి, పేదల తిరుపతిగా పేరుగాంచిన మన్యంకొండ, కురుమూర్తి, కోయిల్సాగర్ ప్రాజెక్టు, కోయిల్కొండ ఖిల్లా వంటి ఎన్నో పర్యాటక కేంద్రాలకు పాలమూరు నిలయంగా ఉందన్నారు. జిల్లా కేంద్రంలోని కేసీఆర్ ఏకో అర్బన్ పార్కు చూ సేందుకు హైదరాబాద్ తదితర ప్రాంతాల నుంచి పర్యాటకులు తరలివస్తున్నారని తెలిపారు. టూరిజం వల్ల ఆదా యం సమకూరడంతోపాటు పలువురికి ఉపాధి లభిస్తుందన్నారు. ఆర్టీసీ అధికారులతో మాట్లాడి ప్రత్యేక బస్సులను హైదరాబాద్ నుంచి ఏర్పాటు చేయాలని సూచించారు. కా గా, పర్యాటక దినోత్సవం సందర్భంగా నిర్వహించిన వివిధ పోటీల్లో ప్రతిభకనబర్చిన విద్యార్థులకు మెమోంటోలను అందజేశారు. అలాగే చిన్నారులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారుల ఆధ్వర్యంలో జిల్లా పర్యాటకంపై ప్రత్యేకంగా రూపొందించి పాడిన పాటలు అందరి నీ అలరింపజేశాయి. కార్యక్రమంలో ఎస్పీ వెంకటేశ్వర్లు, అదనపు కలెక్టర్లు సీతారామారావు, తేజస్ నందలాల్ పవ ర్, డీఆర్వో స్వర్ణలత, డీఈవో ఉషారాణి, మెడికల్ కళాశాల డైరెక్టర్ పుట్టా శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
ప్రతి ఫిర్యాదునూ పరిష్కరిస్తాం
ప్రజా ఫిర్యాదులను పూర్తిస్థాయిలో పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ వెంకట్రావు తెలిపారు. కలెక్టరేట్లోని రెవెన్యూ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణిలో ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించా రు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజావాణి దృ ష్టికి వచ్చిన ఫిర్యాదులను అధికారులు పెండింగ్లో పెట్టకుండా త్వరితగతిన పరిష్కరించాలని సూచించారు. అలా గే రైతులకు భూతగాదాలు లేకుండా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. కాగా, ఫిర్యాదుదారులకు సీనియర్ సిటిజన్లు అందజేస్తున్న సేవలను కలెక్టర్ కొనియాడారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్, డీఆర్వో స్వర్ణలత పాల్గొన్నారు.
ఘనంగా కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి
తెలంగాణ తొలిదశ ఉద్యమకారుడు కొండా లక్ష్మణ్ బా పూజీ జయంతిని కలెక్టరేట్లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బాపూజీ చిత్రపటానికి కలెక్టర్ వెంకట్రా వు, అదనపు కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్ పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో కలెక్టరేట్ ఉద్యోగులు పాల్గొన్నారు.