అయిజ, ఫిబ్రవరి 8 : పట్టణంలో భక్తిభావం ఉ ప్పొంగింది. మేళతాళాలు, భాజాభజంత్రీలు, పటాకుల మోత మధ్య తిక్కవీరేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు బు ధవారం వైభవంగా ప్రారంభమయ్యాయి. తొలి రోజు స్వామిని ఎడ్లబండిపై పురవీధుల్లో ఊరేగించారు. ఈ సందర్భంగా శివనామస్మరణ మార్మోగింది. నందికోళ్ల సేవ, చిన్నారుల హారతుల ర్యాలీ మధ్య మామిడి తోరణాలు, కొబ్బరి ఆకులతో ముస్తాబైన ఎడ్లబండిపై ఆశీనులైన తిక్కవీరేశ్వర స్వామి పట్టణ పురవీధుల్లో ఊరేగారు.
సంప్రదాయబద్ధంగా ఆలయ వ్యవస్థాపక వంశీయులు పాగుంట లక్ష్మీరెడ్డి స్వగృహం నుంచి స్వామిని ఆంజనేయస్వామి ఆలయం, పాత బస్టాండ్ మీదుగా తిరిగి ఆలయం వరకు ఊరేగించారు. అనంతరం అర్చకులు కలశస్థాపన చేశారు. పుట్టమన్ను తెచ్చి మామిడి తోరణాలు, కొబ్బరి ఆకులతో పందిరి వేసి స్వామికి పూజలు చేశారు. భక్తులకు అన్నదానం చేశారు. ఏపీలో ని ఒంగోలుకు చెందిన మురళీకృష్ణ ఈవెంట్ కళాకారు లు ప్రదర్శించిన అఘోరా కళా ప్రదర్శనలు భక్తులను ఆకట్టుకున్నాయి. ఊరేగింపులో కళాకారుల నృత్యాలు అలరించాయి. గురువారం రాత్రి ప్రభోత్సవం నిర్వహించేందుకు ఆ లయ కమిటీ ఏర్పాట్లు చేసింది. బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆలయాన్ని రంగురంగుల విద్యుద్దీపాలతో స ర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు.
బుధవారం రాత్రి మొండి చట్టంపై తిక్కవీరేశ్వరుడు ఊరేగుతూ భక్తులను అనుగ్రహించారు. ఆలయం నుంచి ఆంజనేయస్వామి ఆలయం వరకు భాజాభజంత్రీలు, నందికోళ్ల సేవ, భక్తుల శివనామస్మరణల మధ్య తిక్కవీరేశ్వరుడు మొండి చట్టంపై ఊరేగారు. కార్యక్రమంలో దేవస్థాన కమిటీ సభ్యులు, ప్రజాప్రతినిధులు, తిక్కవీరేశ్వర స్వామి యూత్, భజన బృందం, రైతు, హమాలీ, గ్రామ పెద్దలు, నాయకులు పాల్గొన్నారు.