వనపర్తి, జూలై 20 (నమస్తే తెలంగాణ) : జిల్లా లో మత్స్య సంపద ఏడాదికేడాది పెరుగుతూనే ఉ న్నది. మత్స్యకారుల జీవితాల్లో వెలుగులు నిండుతున్నాయి. చేపల పెంపకంతో మత్స్యకారులతోపా టు ఆధారిత వర్గాల ప్రజలు కూడా లబ్ధి పొందుతున్నారు. దిగుమతి చేసుకోకుండా స్థానికంగా చేపల అభివృద్ధి చేయాలన్న లక్ష్యతో ప్రతి ఏడాది వానకాలంలో చెరువులు, రిజర్వాయర్లు, కుంటలలో చేపపిల్లలు విడుదల చేస్తున్నారు. ఈ ఏడాది కూడా 2.5 కోట్ల చేపపిల్లలను ఉచితంగా అందించేందుకు మత్స్యశాఖ సిద్ధమైంది. వీటిలో కాట్ల, రొహు, మ్రి గల, కామన్కార్ప్ రకాలను అందిస్తున్నది. వానకా లం ప్రారంభం కావడంతో త్వరలోనే చేపపిల్లలు వి డుదల చేసేందుకు అధికారులు ప్రణాళికలు రూ పొందించుకుంటున్నారు. ప్రభుత్వం చేపట్టిన బృహత్తర పథకంతో ప్రత్యక్షంగా, పరోక్షంగా వేలాది కు టుంబాలు జీవిస్తున్నాయి. వనపర్తి జిల్లాలో 109 సొసైటీల్లో సుమారు 8,550 మంది సభ్యులు అధికారికంగా రిజిస్టరై ఉన్నారు. మరో పది వేల కుటుంబాలు పరోక్షంగా జీవిస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు.
ప్రాజెక్టుల్లో చేప పిల్లల విడుదల..
జూరాల, శ్రీశైలం వంటి బహుళార్ధక ప్రాజెక్టుల్లో కూడా వనపర్తి జిల్లా మత్స్యశాఖ చేప పిల్లలను వ దులుతున్నది. ప్రతి ఏడాది మాదిరిగానే ఈ సారి కూడా శ్రీశైలం బ్యాక్వాటర్తోపాటు జూరాల ప్రా జెక్టులో చేపపిల్లలను విడుదల చేసేందుకు సన్నాహా లు చేస్తున్నారు. ప్రాజెక్టు పరిధి ఇతర ప్రాంతాలకు చెందినప్పటికీ.. వనపర్తి జిల్లాకు సంబంధమున్న ప్రాంతాల్లో ఇక్కడి మత్స్యకారులు చేపలు పట్టుకోవడానికి వీలు కల్పించారు. వీటితోపాటు జిల్లాలోని సరళాసాగర్, ఊకచెట్టువాగు, ఏనుగుంట బ్యాలెన్సింగ్, రంగ సముద్రం, గోపల్దిన్నె రిజర్వాయర్లలో చేపపిల్లలు విడుదల చేయనున్నారు. అలాగే గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీ పరిధిలోని చె రువులు, కుంటల్లో కూడా వదలనున్నారు.
చేపపిల్లలను ప్రభుత్వం వంద శాతం సబ్సిడీతో సొసైటీల కు అందజేస్తున్నది. అంతేకాకుండా మత్స్యకారులకు సబ్సిడీపై ఉచితంగా వాహనాలు ఇస్తున్నది. మత్స్య సంపద యోజన పథకం ద్వారా ఎస్సీ, ఎస్టీ మహిళలకు హెక్టారుకు 60 శాతం సబ్సిడీతో రూ.10 లక్షలు అందిస్తున్నది. పురుషులకు, ఇతర ఉన్నత వర్గాలకు 40 శాతం సబ్సిడీతో యూనిట్లు మంజూరు చేసి ప్రభుత్వం ప్రోత్సహిస్తున్నది. మ త్స్య విక్రయ కేంద్రాలకు కూడా 60 శాతం సబ్సిడీతో రూ.10 లక్షలు అందిస్తున్నారు. త్రీవీలర్స్ కూ డా ప్రభుత్వం సరఫరా చేస్తున్నది. చేపపిల్లలకు జి యో ట్యాగింగ్ చేస్తున్నారు. దీని ద్వారా నీటి నిల్వ లు తెలుసుకోవడమే కాకుండా చెరువులు ఆక్రమణకు గురి కాకుండా చూడొచ్చు. ఇందుకోసం నేషనల్ రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీ సేవలు వినియోగించుకుంటున్నారు. శాటిలైట్ వ్యవస్థ ద్వారా చెరువు లు, కుంటలను పర్యవేక్షించనున్నారు.
డిమాండ్ పెరుగుతున్నది..
గతంలో అవగాహన లేక చేపల పెంపకానికి ఎవరూ ముందుకు రాకపోయేది. ప్రస్తుతం డిమాండ్ పెరుగుతున్నది. చేపల పెంపకంతో ఆదాయం వ స్తుండడంతో జిల్లాలో చెరువుల తవ్వకం పెరుగుతున్నది. మత్స్యకార సొసైటీలతోపాటు ఇతరులకు కూడా ఉచితంగా చేపలు అందిస్తున్నాం. ప్రభుత్వం విక్రయ కేంద్రాల యూనిట్లకు సబ్సిడీపై రుణం అందిస్తున్నది. మార్కెటింగ్ సౌకర్యం కల్పించడంతోపాటు త్రీవీలర్ అందిస్తున్నది. ప్రభుత్వం చేపడుతు న్న కార్యక్రమాలతో మత్స్య సంపద గణనీయంగా పెరుగుతున్నది. రిజర్వాయర్లు, చెరువులకు నీరు సమృద్ధిగా వచ్చిన వెంటనే చేప పిల్లలు వదులుతాం.