బాలీవుడ్ అగ్ర కథానాయిక కంగనారనౌత్ కరోనా బారిన పడ్డారు. తన ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా ఆమె ఈ విషయాన్ని వెల్లడించారు. కొద్దిరోజులుగా అలసట, కళ్లలో కాస్త మంటగా అనిపిస్తుండటంతో పరీక్షలు చేయించుకోగా పాజిటివ్గా నిర్ధారణ జరిగిందని ఆమె తెలిపింది. తన శరీరంలో ఈ వైరస్కు ఏమాత్రం చోటులేదని, త్వరలోనే దానిని నాశనం చేస్తానని ఆమె విశ్వాసం వ్యక్తం చేసింది. ‘మనం భయపడితే వైరస్ మరింతగా భయపెడుతుంది. కరోనా అనేది చిన్న ప్లూ వైరస్ మాత్రమే. అది మనల్ని మానసికంగా కృంగదీస్తోంది. అందరం కలిసి దానిపై విజయం సాధిద్దాం’ అని కంగనా రనౌత్ ఇన్స్టాగ్రామ్లో పేర్కొంది.