సారంగ వడ్డెపల్లి రచించిన ‘సెల్ఫీ’ కథల సంపుటి ఆవిష్కరణ సెప్టెంబర్ 6 ఉదయం 10 గంటలకు మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ట్వింకిల్ స్టార్ క్యాంపస్ (ప్రభుత్వ డిగ్రీ కాలేజీ ఎదురుగా)లో జరుగుతుంది. ఈ కార్యక్రమంలో ప్రముఖ రచయితలు శిరంశెట్టి కాంతారావు, కొండి మల్లారెడ్డి, పర్కపెల్లి యాదగిరి పాల్గొంటారని మహబూబాబాద్లోని ధరిత్రి సాహితీ మిత్రుల సంగమం తెలిపింది.