పుస్తకాలు జ్ఞాన కేంద్రాలే కాదు మనుషుల్ని… దేశాల్ని కలిపే సాంస్కృతిక, సామాజిక రాయబారులు కూడా. అందుకు ఉదాహరణ దేశదేశాల్లో జరుగుతున్న విశ్వ పుస్తక మేళాలు… పుస్తక ప్రదర్శనలు. జర్మనీలో జరిగే ‘ఫ్రాంక్ ఫర్ట్ బుక్ ఫెయిర్’ రాశి లోను, వాసిలోనూ అతి పెద్దది. తర్వాత న్యూ ఢిల్లీలో నేషనల్ బుక్ ట్రస్ట్ ఇండియా అధ్వర్యంలో జరిగే న్యూ ఢిల్లీ వరల్డ్ బుక్ ఫెయిర్. ఇవి కాక చిన్నా పెద్ద పుస్తక మేళాలు దాదాపు అన్ని దేశాల్లో జరుగుతాయి.
గతంలో పలు దేశాల పుస్తక మేళాల్లో పాల్గొన్నాను. ఈమారు నా పుస్తక యాత్ర దక్షిణ కొరియా రాజధాని సియోల్ లో సాగింది. గతంలో నేను చూసిన, పాల్గొ న్న పుస్తక మేళాలకంటే ఇది నాకు కొద్దిగా భిన్నంగా కనిపించింది. కొరియా మనదేశం లాగే చారిత్రక నేల. ఆధునిక కాలంలో ప్రపంచంలోని నివాస యోగ్యమైన అతి కొన్ని నగరాల్లో సియోల్ ఒకటి. అత్యంత తలసరి ఆ దాయం కలిగిన నగరం. అత్యంత సుంద ర, పరిశుభ్రమైన నగరం. మరో ఆశ్చర్యకర విష యం ఏంటం టే శాంసంగ్… హుందాయ్ వంటి ప్రపంచంలోని 500 పెద్ద కంపెనీల ప్రధాన కార్యాలయాలు ఇక్కడే ఉన్నాయి.
సియోల్ అంతర్జాతీయ పుస్తక మేళా 5 రోజుల పాటు సాగింది. ఇండియాతో పాటు మరో ముప్పయ్ దేశాలు ఇందులో పాల్గొన్నా యి. షార్జా అతిథి దేశం, ప్రత్యేకంగా పాల్గొ న్న దేశం కెనడా.అన్ని మేళాల్లో అన్ని పుస్తకాలలో భాగంగా పిల్లల పుస్తకాలు ఉంటాయి. అయితే ఇక్కడ మాత్రం వాతావరణం చాలా భిన్నంగా కనిపించింది. ప్రదర్శనకు ఉంచిన పుస్తకాల్లో ప్రధాన భాగం బాల సాహిత్యం కావడం నేను ఈ నాలుగు మాటలు రాసేందుకు కారణమయ్యింది. మరో ముఖ్యమైన విషయం అన్ని పుస్తకాల్లో నూటికి తొంబై తొమ్మిది శాతం పుస్తకాలు కొరియా భాషలో నే ఉండడం. విదేశాల నుంచి వెళ్లిన వాళ్ళం మన భాషలతో పాటు కొన్ని ఆంగ్ల పుస్తకాలు ప్రదర్శనకు ఉంచుతాం. మన దేశపు మేళాల్లో కేరళ, తమిళనాడు, కర్ణాటక వంటి కొన్ని ప్రాంతాల మేళాలను మినహాయిస్తే ప్రాంతీ య భాషలో లభించే పుస్తకాలు ఏ మేరకు ఉంటాయో మనకు తెలుసు. భాషా సంస్కృతులకు ఏ దేశం పెద్దపీట వేస్తుందో ఆ దేశం అన్ని రంగాల్లో వికాసం చెందుతుంది. కొరియాలోనూ అదే జరుగుతున్నది. ఆంగ్లంలో ఉన్న పుస్తకాలకంటే అక్కడి భాషకే ప్రాధా న్యం. అందువల్ల చక్కని బాల సాహిత్యం ఆ నేల మీద నుంచి వస్తున్నది. పిల్లల వయసుల వారీగా సాహిత్యాన్ని అందించడంతో పాటు ప్రధానంగా బొమ్మల పైనే దృష్టి సారించడం కొరియా పుస్తకాల్లో చూడొచ్చు.
అక్కడి కొరియా ప్రచురణ కర్తలు మాత్ర మే కాదు, షార్జా, కెనడా, సౌదీ, గ్రీస్, యితర యూరోపియన్ దేశాల ప్రచురణ కర్తలు కూ డా బాలల పుస్తకాలను తేవడం గొప్ప విష యం. మేళాల్లో కేవలం అమ్మకాలు మాత్రమే జరుగవు. ముఖ్యంగా అంతర్జాతీయ మేళా ల్లో ఒక దేశ రచయితల పుస్తకాల హక్కులు మరో దేశం వాళ్ళు కొనుక్కునే రైట్స్ టేబుల్ సమావేశాల వంటివి జరుగుతాయి. ఇవి కాక వివిధ కంపెనీల సీఈవోల సమావేశాలు ఒక దేశపు సాహిత్యం మరో దేశ భాషలోకి వెళ్లేందుకు దోహదం చేస్తాయి. ఈసారి ఈ సమావేశాల్లో నేను గమనించింది కూడా బాల సాహిత్యం గురించే.
విదేశీ ప్రచురణకర్తలతో పాల్గొన్న సమావేశాల్లో ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న బాల సాహిత్య వికాస కార్యక్రమాలతో పాటు అనేక అంశాలు తెలిశాయి. నిజానికి బోలోనలో జరిగే చిల్డ్రన్ బుక్ ఫెయిర్ పిల్లల పుస్తక మేళాల్లో పెద్దదని చెప్పాలి. ఇది పిల్లల కోసమే ఏర్పాటు చేసింది. అయితే సియోల్లో దాదాపు అక్కడి వాతావరణం కనిపించడం గొప్ప విషయం.
మన తెలుగు పిల్లల్లాగే ఇక్కడి పిల్లలు కూడా చక్క ని సాహిత్యాన్ని సృజిస్తున్నా రు. అవి అచ్చవుతున్నయి కూడా. సాంస్కృతికంగా ఒ క ప్రాంతానికి మరో ప్రాం తానికి వ్యత్యాసాలు ఉండ డం సాధారణమే, కానీ పిల్ల లు ఎక్కడైనా పిల్లలే. వాళ్ల ఆలోచనలన్నీ ఒకే విధంగా ఉంటాయి. అది ఇక్కడ స్ప ష్టంగా కనిపించింది. మనకున్నట్టే తాతలు, అమ్మలు చెప్పే కథలు, గేయాలు, పొడుపు కథల వంటివి కొరియాలోనూ ఉన్నాయి. జానపద కథలు సరేసరి. అయితే ఆధునిక కథల్లో నిజజీవిత సంఘటనలు, మానవ సంబంధాలు వంటివి ప్రధానంగా ఉండడం విశేషం. సాంకేతికతను ఉపయోగించుకోవడంలో చాలా ముందున్నారు ఇక్క డి రచయితలు, పిల్లలు, ప్రచురణకర్తలు, తల్లిదండ్రు లు. చైనాస్టాల్లో ఉంచిన కథల టాయ్స్ నా కు బాగా నచ్చాయి. మన చోటా భీమ్ లాం టి బొమ్మలన్నమాట. ఆ బొమ్మకు బటన్ నొ క్కగానే తన క్యారెక్టర్తో ముడిపడిన కథలను చక్కగా చెబుతుంది, మన నానమ్మ, అమ్మమ్మలలాగా. బొమ్మల పుస్తకాల ముద్రణలో ను వైవిధ్యం, అచ్చులోనూ అదే విధానం. ఇ క్కడి పిల్లల కోసం వీళ్లు సృష్టించుకున్న రో బోమాన్తో పాటు అనేక కొత్త క్యారెక్టర్లు కనిపించడం వీళ్ల విజ్ఞతకు నిదర్శనం. అయి తే బార్బీడాల్ మాత్రం ఇక్కడ కూడా ఉన్నది.. అదీ వీళ్ల తరహానే సుమా!
అభూత కల్పనలు పిల్లలకే కాదు పెద్దలకు కూడా న చ్చుతాయి. కానీ నిజ సంఘటనలు, స్ఫూర్తిని, చేతనని కలిగించేవి పిల్లలపైన చివరివరకు ప్రభావాన్ని చూపుతాయి.
(సౌత్ కొరియా రాజధాని సియోల్ నుంచి)
-డాక్టర్ పత్తిపాక మోహన్
99662 29548