చింతపట్ల సుదర్శన్ అనువాదం ‘శిలావిలాపం’, ‘రవీంద్రనాథ్ కథలు’ ఆవిష్కార సభ 2022, మే 20న సాయంత్రం 6 గంటలకు హైదరాబాద్ బాగ్లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరుగుతుంది. డాక్టర్ ఏనుగు నరసింహారెడ్డి అధ్యక్షతన జరుగు సభలో ముఖ్య అతిథిగా కె.శివారెడ్డి, ఆవిష్కర్తగా డాక్టర్ అమ్మంగి వేణుగోపాల్, ఆత్మీయ అతిథిగా కవి యాకూబ్, సమీక్షకులుగా ఆర్వీ రామారావు, కేపీ అశోక్కుమార్ పాల్గొంటారు.
–పాలపిట్ట బుక్స్
దళిత కవుల గమనం-సభ
ప్రొఫెసర్ ఎండ్లూరి సుధాకర్ స్మరణ (గబ్బిలం- కొత్తగబ్బిలం- దళిత కవుల గమనం) సభ 2022 మే 21న సాయం త్రం 6 గంటలకు హైదరాబాద్ సారస్వత పరిషత్ హాల్లో జరగనున్నది. డాక్టర్ పసునూరి రవీందర్ అధ్యక్షతన జరిగే ఈ సభ లో ఆచార్య కొలకలూరి ఇనాక్, డాక్టర్ కోయి కోటేశ్వరరావులు ప్రసంగిస్తారు. అతిథులుగా ఖాదర్ మొహియుద్దీన్, కృపాకర్, రాజశేఖర్, శ్రిఖామణి, సుధాకిరణ్, వినోదిని, మానస పాల్గొంటారు. అనంత్, అని ల్ డానీ, కొడవటికల్లు సామేలు, ఖాజా, శోభా భట్, జూపాక సుభద్ర, విమల మోర్త ల, ఒమ్మి రమేష్ బాబు కవితా పఠనం చేస్తారు. లెల్లె సురేష్, డాక్టర్ సత్యం తలారి సమన్వయం చేస్తారు.
– కాలం గుండె చప్పుడు, 9441713930
ప్రతిభా పురస్కారాలు
కుందుర్తి ఆంజనేయులు శతజయంతి సందర్భంగా ‘ఫ్రీవర్స్ ఫ్రంట్’ నిర్వాహకులు ఆరుగురు కవులకు ప్రతిభా పురస్కారాలు ప్రకటించారు. అడిగోపుల వెంకటరత్నం, దాట్ల దేవదానం రాజు, రాధేయ, దేవరాజు మహారాజు, సీతారాం, అనిశెట్టి రజిత ఈ పురస్కారాలు అందుకోనున్నారు. కుందుర్తి కుటుంబసభ్యుల నిర్వహణలో 2022 మే 21న సాయంత్రం 4.30 గంటలకు ‘జూమ్’ సమావేశం జరగనున్నది. కవుల పరిచయం సుధామ చేస్తారు.
– శీలా వీర్రాజు, ‘ఫ్రీవర్స్ ఫ్రంట్’ నిర్వాహకులు