కార్టూనిస్ట్ శేఖర్ స్మారకార్థం యేటా ఇస్తున్న అవార్డుల ప్రదానం ఈ నెల 19వ తేదీ ఉదయం 10.30 గంటలకు హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో జరుగనున్నది.
2026 సంవత్సరానికిగాను కార్టూనిస్ట్ నారు, ఆర్టిస్ట్ కూరెళ్ళ శ్రీనివాస్ అవార్డులను అందుకోనున్నారని శేఖర్ కుటుంబ సభ్యులు, ఫోరం ఫర్ పొలిటికల్ కార్టూనిస్ట్స్ తెలిపారు. ఈ అవార్డు కింద రూ.10,116 నగదు, ప్రశంసాపత్రం అందజేస్తామని పేర్కొన్నారు.