ఈ నెల 12న సాయంత్రం 5 గంటలకు హైదరాబాద్లోని మాజీ ఉప రాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు స్వగృహంలో ‘చెన్నమనేని రంగనాయకమ్మ స్మారక విశిష్టాద్వైత జాతీయ సాహిత్య పురస్కారం’ ప్రదానోత్సవ కార్యక్రమం జరుగనున్నది. ముఖ్య అతిథిగా వెంకయ్యనాయుడు హాజరవుతుండగా.. రేవూరి అనంత పద్మనాభరావు సభాధ్యక్షత వహించనున్నారు. శ్రీదేవి మురళీధర్రావు, గార రంగనాథం, వైష్ణవ వేంకటరమణమూర్తిలను ఈ కార్యక్రమంలో సత్కరిస్తారు. అనంతరం ‘శ్రీభాష్యం-కరదీపిక’, ‘వేదాంత దేశికులు-హంస సందేశము’ పుస్తకాల ఆవిష్కరణ ఉంటుంది.
– శ్రీలేఖ సాహితీ, వరంగల్