జరీనా స్క్రూవాలా ముంబైకి చెందిన సంఘ సేవకురాలు, వ్యాపారవేత్త. భర్త రోనీ స్క్రూవాలాతో కలిసి ‘స్వదేశ్ ఫౌండేషన్’ స్థాపించారు. ఎనిమిదేండ్ల వయసులో అమెరికా నుంచి వచ్చి.. ఇక్కడే స్థిరపడ్డారు జరీనా. ముంబైలోనే చదువు పూర్తిచేసి థియేటర్ ఆర్టిస్ట్గా పేరు తెచ్చుకున్నారు. తాను ప్రొడక్షన్ మేనేజర్గా వ్యవహరించిన ‘పదమ్సీ’ నాటిక అప్పట్లో ఓ సంచలనం. 1990లో భర్త రోనీ, వ్యాపార భాగస్వామి దేవేన్ ఖోటేతో కలిసి ‘యూటీవీ’ని స్థాపించారు. కంపెనీ తరఫున సామాజిక సేవనూ చేపట్టారు.
మహారాష్ట్రలోని గ్రామీణ మహిళలకు సాధికారత కల్పించేందుకు ‘స్వదేశ్ ఫౌండేషన్’ స్థాపించారు. దాన్నే ‘సొసైటీ టు హీల్, ఎయిడ్, రిస్టోర్, ఎడ్యుకేట్ (SHARE)’గా మార్చి.. గ్రామాల్లో మౌలిక వసతులపై దృష్టిసారించారు. తాగునీరు, ఆరోగ్య సంరక్షణ, విద్య, పారిశుధ్యం ప్రధాన లక్ష్యాలుగా ఎంచుకున్నారు. ‘గ్రామ అభివృద్ధి కమిటీ (వీడీసీ)’లను నియమించి.. ఇంటింటా అవగాహన కల్పించారు. గ్రామసభలు, నాటకాలు, ఆటలు, వీడియో షోల ద్వారా మహిళా సాధికారత దిశగా అడుగులు వేయించారు. డ్వాక్రా సంఘాల్లోని ఔత్సాహిక మహిళలను వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దారు జరీనా.