గుజరాత్కు చెందిన వైశాలి మెహతా నవతరం వ్యాపారవేత్త. తాను పనిచేస్తున్న డిజిటల్ మార్కెటింగ్ కంపెనీ అకారణంగా అవమానించడంతో.. కోపంతో రిజైన్ చేసి న్యూయార్క్ వెళ్లింది. అక్కడ పండ్ల రసాలను తలపించే సిరప్లు రుచి చూసింది. ఎంతో నచ్చేశాయి. తాను కూడా సహజ సిద్ధమైన ఫ్రూట్ సిరప్లు తయారు చేయాలని నిర్ణయించుకుంది. ఇండియాకు తిరిగొచ్చాక.. ‘స్వా ఆర్టిసనల్ సిరప్స్’ పేరుతో ఓ కంపెనీ స్థాపించింది.
మంచి డిమాండ్ ఉండటంతో ఐస్ టీ, లెమనేడ్స్, స్పెషాలిటీ క్రాఫ్ట్ కాఫీస్, మాక్ టైల్, కాక్టైల్ మిక్సెస్ వంటి సిరప్లను మార్కెట్కు పరిచయం చేసింది. ఈ-కామర్స్ వెబ్సైట్ల ద్వారా విక్రయాలు ప్రారంభించి.. అనతి కాలంలో లక్షలాది మంది వినియోగదారులను సొంతం చేసుకుంది వైశాలి. ప్రస్తుతం రెండొందల ఔట్లెట్లలో ఈ సిరప్లు అమ్ముతున్నారు. ఆన్లైన్లో వేల ఆర్డర్లు వస్తున్నాయి. తన బెంగళూరు యూనిట్లో పూర్తిగా మహిళలనే నియమించుకుంది వైశాలి. గతంలో ఆమె రాజీనామా చేసిన కంపెనీలో ‘స్వా’ సిరప్లనే వాడుతున్నారు.