ఇప్పుడు టీవీలు గోడలెక్కాయి. వెండి తెరకు రంగుల నీడలా తయారయ్యాయి. నెట్ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ తదితర ఓటీటీలు బోలెడు సినిమాలతో ఊరిస్తున్నాయి. ఇల్లే ఓ సినిమాహాలు అయిపోతున్నది. ఓ అడుగు ముందుకేసి.. మల్టీప్లెక్స్లో చూసిన ఫీలింగ్ను తీసుకొచ్చేందుకు సోనీ సంస్థ పోర్టబుల్ థియేటర్ సిస్టమ్ను తీసుకొచ్చింది.
ఇది మూడు స్పీకర్ల సెట్. ఇవి టీవీ, ఐపాడ్లాంటి వాటికి బ్లూటూత్ ద్వారా అనుసంధానం అవుతాయి. సినిమా చూస్తున్నప్పుడు ఈ మూడు స్పీకర్లనూ మనం కూర్చున్న చోటికి మూడు వైపులా పెట్టుకుంటే.. హోమ్ థియేటర్ తరహా సినిమాటిక్ సౌండ్లను వినొచ్చు. సోనీ హెచ్టీ ఎఎక్స్-7 పేరిట వచ్చిన దీని ధర రూ.41 వేలు. sony.comలో కొనుగోలు చేయవచ్చు.