భారతీయ మహిళలు దేశవిదేశాల్లోనూ పలు రంగాల్లో ఉన్నత స్థానాల్లో రాణిస్తూ దేశకీర్తిని విశ్వవ్యాప్తం చేస్తున్నారు. అలా సత్తా చాటుతున్న వారిలో తెలుగు మహిళలు ఎందరో! తాజాగా అమెరికా కాలిఫోర్నియాలోని శాక్రమెంటో సుపీరియర్ కోర్టు జడ్జిగా తెలుగు మహిళ జయ బాడిగ నియమితులయ్యారు. తెలుగు రాష్ర్టాల నుంచి ఈ పదవికి ఎంపికైన తొలి మహిళగా ఆమె గుర్తింపు పొందారు. 2022 నుంచి జయ కోర్టు కమిషనర్గా పనిచేస్తున్నారు.
విజయవాడలో పుట్టిన జయ హైదరాబాదులో ప్రాథమిక విద్యను పూర్తి చేసుకున్నారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి సైకాలజీ, పొలిటికల్ సైన్సు సబ్జెక్టులతో బీఏ చేశారు. బోస్టన్ విశ్వవిద్యాలయంలో ఉన్నతవిద్య అభ్యసించారు. కాలిఫోర్నియాలోని డిపార్ట్మెంట్ ఆఫ్ హెల్త్కేర్ సర్వీసెస్ అటార్నీగా, గవర్నర్ కార్యాలయ అత్యవసర సేవల విభాగంలోనూ ఆమె పనిచేశారు. అమెరికా గడ్డపై తెలుగు కీర్తి రెపరెపలాడించిన జయ పేరు సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది.