Nauf Almarai | నవూఫ్ అల్మరీ.. సౌదీ అరేబియాలో తొలి యోగాచార్యురాలు. యోగా దినోత్సవం నాడు పదివేల మందితో పెద్ద ఎత్తున ఉత్సవం నిర్వహించి రికార్డు సృష్టించారు. సౌదీ ప్రజలు స్వతహాగా ఫిట్నెస్ ప్రియులు. ఆరోగ్యానికి ప్రాధాన్యం ఇస్తారు. దీంతో తన పని సులభమైందని చెబుతారు నవూఫ్. ‘యోగా మనసును శుద్ధి చేస్తుంది. హింసాత్మక ఆలోచనలను బుర్రలోంచి తొలగిస్తుంది. ఆధునిక సమాజానికి అవసరమైంది ఇదే’ అని వివరిస్తారామె. తను చేపట్టిన యోగా ప్రచార ఉద్యమానికి గుర్తింపుగా భారత ప్రభుత్వం 2018లో పద్మశ్రీ పురస్కారంతో గౌరవించింది. నవూఫ్ దృష్టిలో మత విశ్వాసాలకు, దేశాల సరిహద్దులకు అతీతమైంది యోగా.
‘సౌదీ తర్వాత భారతదేశమే నా మాతృభూమి. ఈ దేశం నాకు జ్ఞానాన్ని ప్రసాదించింది. నాలోని నన్ను తెలుసుకునే అవకాశం ఇచ్చింది’ అని ఉద్వేగంగా చెబుతారు. సౌదీ ప్రభుత్వం తమ దేశంలో యోగా క్లాసులను అనుమతించడానికి ముందు చాలా కసరత్తు చేసింది. అనేక అధ్యయనాల తర్వాతే.. పచ్చజెండా ఊపింది. ‘ఆయుర్వేద విజ్ఞానాన్ని సౌదీ ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నది నా ఆలోచన. నా తదుపరి ప్రయత్నం ఆ వైపుగానే ఉంటుంది’ అంటూ భవిష్యత్ ప్రణాళిక వివరిస్తారు నవూఫ్. తాజా భారత పర్యటనలో భాగంగా ఆమె కోణార్క్లోని సూర్య దేవాలయాన్ని సందర్శించారు. ఆ శిల్ప కళా సంపదను రాతితో మలిచిన కావ్యంగా అభివర్ణించారు.