రోడ్డు మీద రయ్యిన దూసుకుపోవాలంటే లీటర్ల కొద్దీ పెట్రోల్ మంట పెట్టక్కర్లేదు. పర్యావరణాన్ని పచ్చగా కాపాడుకుంటూనే ప్రయాణం చేయొచ్చని భరోసా ఇస్తున్నాయి ఎలక్ట్రిక్ వెహికిల్స్ (ఈవీలు). కర్బన ఉద్గారాలను తగ్గించేందుకు తమ వంతు ప్రయత్నం చేస్తున్న వాహనాల కంపెనీలు సైతం వీటి తయారీకి మొగ్గు చూపుతున్నాయి. అందుకే, తాజాగా లాస్ వెగాస్లో జరిగిన కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్ షో (సీఈఎస్)లో భవిష్యత్తులో తాము తీసుకురాబోతున్న కార్లను ప్రదర్శించాయి. లుక్లోనూ.. టెక్నాలజీలోనూ.. ‘వారెవ్వా!’ అనిపిస్తున్న ఆ మాడల్స్ ఏంటో చూసేద్దాం..
హోండా.. భారత జనాభాకు సుపరిచితమైన సంస్థ. కార్ల అమ్మకాల్లో ముందు వరుసలో ఉన్న హోండా
‘0 సిరీస్’ పేరిట రెండు ఎలక్ట్రిక్ వెహికిల్స్ను తయారు చేసింది. ‘సలూన్’ పేరిట ఒక సెడాన్, స్పేస్-హబ్ పేరిట ఎస్యూవీ తరహా వాహనాన్నీ కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్ షోలో ప్రదర్శనకు పెట్టింది. వావ్ అనిపించేలా ఉన్న ఈ బండ్లు 2026లో మార్కెట్లోకి రానున్నాయి. వీటి ఇంటీరియర్స్, ఎక్స్టీరియర్స్ను పర్యావరణహిత ఉత్పత్తులతోనే తయారు చేస్తున్నారు.
సౌకర్యంగా ప్రయాణించగలిగేలా అత్యాధునిక టెక్నాలజీతో రూపొందిస్తున్నారు. పక్షి రెక్కల్లా తెరుచుకునే డోర్లతో.. స్పోర్ట్స్ కార్ను తలపించే ‘సలూన్’ షోలో సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్గా నిలిచింది. 2040 నాటికి పూర్తి ఎలక్ట్రిక్ బ్రాండ్గా అవతరించాలన్నది హోండాలక్ష్యం.
అదే బాటలో..
ఈ మధ్య బాగా పాపులర్ అయిన కియా కూడా ఈ షోలో తన ఫ్యూచరిస్టిక్ కార్లను ప్రదర్శించింది. కారే ఇల్లుగా, ఆఫీసుగా, వ్యానుగా.. ఎలా కావాలంటే అలా మారిపోయేట్టు రూపొందించింది. ప్లాట్ ఫామ్ బియాండ్ వెహికిల్ (పీబీవీ) పేరిట తీసుకొస్తున్న ఈ కార్లు ఇంకాస్త విశాలంగా ఉంటాయి. ఉదాహరణకు.. రాత్రిపూట ప్రయాణించేప్పుడు అర్జంటుగా ఏదో ఆఫీసు పనిపడింది. వెంటనే కారు పక్కకు పెట్టి స్టీరింగ్ను పైకి జరిపితే చాలు..
అదే డెస్క్ల్యాంప్లా, డ్యాష్బోర్డే డెస్కులా మారిపోతాయన్నమాట. ఇందులో పీవీ5, పీవీ7, పీవీ1 పేరిట మూడు రకాలను ముందుగా ప్రదర్శించింది సంస్థ. అయితే ఇవి పూర్తిస్థాయిలో మార్కెట్లోకి రావడానికి దశాబ్దకాలం పట్టొచ్చు. అప్పటి వరకూ ఎదురుచూస్తూ ఉండటమే.
ఇంకెన్నో