ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 1.88 లక్షల దోమతెరల అందజేత
ఉట్నూర్ ఐటీడీఏ ఆధ్వర్యంలో పంపిణీ పూర్తి
వినియోగంపై ఏజెన్సీలోని గిరిజనులకు అవగాహన
తగ్గుముఖం పడుతున్న మలేరియా కేసులు
కుమ్రం భీం ఆసిఫాబాద్, జూలై 25(నమస్తే తెలంగాణ)/ఉట్నూర్ : “దోమలు పుట్టకుండా.. కుట్టకుండా చూసుకుందాం..! దోమ తెరలు వాడండి.. దోమల వల్ల వచ్చే వ్యాధులకు గురికాకుండా చూసుకోండి..! నిల్వ నీరు ఉండనీయ కండి.. దోమల పెరుగుదలకు అవకాశం ఇవ్వకండి..” ఇవీ ఉమ్మడి రాష్ట్రంలో నినా దాలుగానే మిగిలాయి. స్వరాష్ట్రం ఏర్పడిన తర్వాత ఏజెన్సీలో ప్రబలుతున్న వ్యాధులపై సర్కారు దృష్టిసారిం చింది. ముందస్తు గానే సర్వేలు నిర్వహించడం, దోమ తెరలు పంపిణీ చేయడం చేస్తున్నారు. ఇందులో భాగంగా ఈ యేడా ది కూడా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా ఐటీడీఏ పరిధిలోని ఏజెన్సీ గ్రామాల్లో 1.88 దోమతెరలు పంపిణీ చేశారు. ఇవీ ప్రత్యేకించి తయారు చేయించిన కెమికల్ కోటెడ్ బెడ్నెట్స్. వీటిని నాలుగేండ్లు వాడుకోవచ్చని అధికారులు పేర్కొంటున్నారు.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా ఐటీడీఏ అధికారులు 1,88,772 దోమ తెరల పంపిణీకి శ్రీకారం చుట్టారు. ఇందులో కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో 95,534, ఆదిలాబాద్లో 40,429, మంచిర్యాలలో 31,727, నిర్మల్లో 21,082 పూర్తిస్థాయిలో పంపిణీ చేశారు. మలేరియా ప్రభావిత గ్రామాల్లో దోమల మందు పిచికారీ చేయడంతోపాటు దోమ తెరలను అందించారు. దీంతో పాటు పల్లె ప్రగతిలో భాగంగా గ్రామ పంచాయతీల ఆధ్వర్యంలో ఎప్పటికప్పుడు పారిశుధ్య కార్యక్రమాలు చేపడుతున్నారు. మలేరియా ప్రభావిత ప్రాంతాలుగా ఉన్న 68 గ్రామాల్లో 2,685 ఇండ్లలో దోమల మందు పిచికారీ చేయడంతోపాటు మలేరియా పాక్షిక ప్రభావిత గ్రామాల్లోనూ దోమ తెరలను పంపిణీ చేశారు. దీంతో గ్రామాల్లో మలేరియా వ్యాప్తికి దాదాపుగా అడ్డుకట్ట పడింది.
తగ్గిన మలేరియా కేసులు
సర్కారు ముందస్తు చర్యలతో మలేరియా కేసులు అనూహ్యం గా తగ్గాయి. ఆసిఫాబాద్ ఏజెన్సీలో గతంతో పోలిస్తే మలేరియా పాజిటివ్ కేసులు పెద్ద సంఖ్యలో తగ్గినట్లు తెలుస్తున్నది. మలేరియా నివారణ కోసం ప్రభుత్వం తీసుకుంటున్న ముందస్తు చర్యలతో ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటివరకు కేవలం ఐదు కేసులు మాత్రమే నమోదయ్యాయి. మరో ఐదు పైలేరియా(బోదకాలు) కేసులు నమోదు అయ్యాయి.