న్యూఢిల్లీ: భారత మాజీ క్రికెటర్, 1983 ప్రపంచకప్ హీరో యశ్పాల్ శర్మ (66) మృతి చెందారు. ఢిల్లీలో మంగళవారం ఉదయం వాకింగ్ చేశాక ఇంటికి వచ్చిన ఆయన హఠాత్తుగా గుండెపోటుకు గురై కన్నుమూశారు.1978 నుంచి 1985 వరకు యశ్పాల్ శర్మ టీమ్ఇండియాకు ఆడారు. మొత్తం 37 టెస్టుల్లో 2 శతకాలతో 1606 పరుగులు, 42 వన్డేల్లో 4 సెంచరీలతో 883 రన్స్ చేశారు. ఫస్ట్క్లాస్ క్రికెట్లో 44 సగటుతో 8933 పరుగులు సాధించారు. మిడిల్ఆర్డర్లో దూకుడుగా ఆడి ఆయన బౌలర్లకు చుక్కలు చూపేవారు. 1983 ప్రపంచకప్ తొలి మ్యాచ్లోనే భీకర వెస్టిండీస్పై 89 పరుగులు చేసిన యశ్పాల్.. ఆ తర్వాత సెమీస్లో ఇంగ్లండ్పై అర్ధశతకంతో జట్టును గెలిపించారు. భారత్ తొలి ప్రపంచకప్ నెగ్గడంలో కీలకపాత్ర పోషించారు. భారత సెలెక్టర్గానూ ధోనీని ఎంపిక చేసి భేష్ అనిపించుకున్నారు. యశ్పాల్ మృతి పట్ల రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, ప్రధాని నరేంద్ర మోదీ, మాజీ, ప్రస్తుత క్రికెటర్లు, ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. ఓ ఇంటర్వ్యూలో యశ్పాల్ను గుర్తు చేసుకొని 1983 ప్రపంచకప్ కెప్టెన్ కపిల్దేవ్ కన్నీరు పెట్టుకున్నాడు.