ఖమ్మం, ఫిబ్రవరి 11: స్త్రీలపై ట్రోలింగ్పై ప్రజాస్వామికవాదులు, లౌకికవాద శక్తులంతా ఒక్కటై ఉద్యమించాలని ప్రజాస్వామ్య రచయిత్రుల వేదిక (ప్ర.ర.వే) ప్రధాన కార్యదర్శి, రచయిత్రి మల్లీశ్వరి పిలుపునిచ్చారు. ఖమ్మం నగరంలోని వేదిక కల్యాణ మండపంలో ప్ర.ర.వే ఏడో మహాసభల్లో భాగంగా రెండోరోజు ఆదివారం ‘స్త్రీలపై ట్రోలింగ్’ అంశంపై నిర్వహించిన సదస్సులో ఆమె మాట్లాడారు. సమాజంలో ప్రస్తుత పరిణామాలను గమనిస్తూ, వాటిని విశ్లేషిస్తూ ప్ర.ర.వే అక్షరబద్ధం చేస్తున్నదన్నారు. తమ రచనలు కూడా సామాజిక మాధ్యమాల్లో ట్రోలింగ్కు గురయ్యాయన్నారు. సోషలిస్ట్ భావాలు ఉన్న వారు కూడా స్త్రీలను ట్రోలింగ్ చేయడం దారుణమన్నారు. వాస్తవాలను మాట్లాడే వారిని మత ఛాందసవాదులు ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి మాట్లాడుతూ..
వాస్తవాలను మాట్లాడే వారిని కొందరు పనిగట్టుకుని మరీ ట్రోలింగ్ చేస్తున్నారన్నారు. వాటన్నింటినీ తిప్పికొట్టాల్సిన అవసరం ఉందన్నారు. ప్రజాగాయని విమలక మాట్లాడుతూ.. ట్రోలింగ్ను ఎదుర్కోవాలంటే ప్రజాస్వామిక వాదలందరూ ఒక్కటవ్వాలన్నారు. సరికొత ్తఉద్యమాలకు నాంది పలకాలన్నారు. అనంతరం ప్ర.ర.వే జాతీయ కోశాధికారి రామలక్ష్మి సంఘం నూతన కార్యవర్గాన్ని ప్రకటించారు. తర్వాత రచయత్రి కాత్యాయనీ విద్మహే రచించిన నవలను అతిథులు ఆవిష్కరించారు. కార్యక్రమంలో రచయిత్రులు శిలాలోలిత, శీలా సుభద్రాదేవి, ఎండ్లూరి మానస తులసి చందు, మెర్సీ మార్గరెట్, స్వేచ్ఛ , అరుణ గోగులమండ. కేంద్ర సాహిత్య అకాడమీ సభ్యుడు ప్రసేన్, యాంకర్ ఉదయభాను, హేతువాది బైరి నరేష్ పాల్గొన్నారు.