ఖమ్మం రూరల్, మార్చి 21: ఖమ్మం నగరానికి చెందిన డాక్టర్ కడవెండి వేణుగోపాల్, అన్నం సేవా ఫౌండేషన్ మేనేజర్ కేశపట్నం శ్రీనివాసులు గురువారం ప్రపంచ అటవీ దినోత్సవం సందర్భంగా రెడ్డిపల్లిలోని పద్మశ్రీ వనజీవి రామయ్య స్వగృహానికి చేరుకున్నారు. ‘వనజీవి’ దంపతులను సన్మానించారు. నేటి యువత వనజీవిని స్ఫూర్తిగా తీసుకుని మొక్కల పెంపకం, సంరక్షణకు ప్రాధాన్యం ఇవ్వాలని పిలుపునిచ్చారు.