కారేపల్లి, సెప్టెంబర్ 5: సీఎం కేసీఆర్తోనే ఇంటింటికీ ప్రభుత్వ ఫలాలు అందుతున్నాయని వైరా ఎమ్మెల్యే రాములునాయక్ పేర్కొన్నారు. అన్ని వర్గాల ప్రజల కోసమే బీఆర్ఎస్ ప్రభుత్వం అనేక అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమ లు చేస్తోందన్నారు. మండలంలోని పాత, కొత్త కమలాపురం గ్రామాల్లో సీసీ రోడ్ల నిర్మాణ పనులకు మంగళవారం ఆయన శంకుస్థాపన చేసి మాట్లాడారు. వివాహ వయసు గల ఆడ పిల్లలున్న పేద ల కుటుంబాలకు కల్యాణలక్ష్మి పథకం గొప్ప వరం లాంటిందని అన్నారు. పేదలు ఆత్మగౌరవంతో జీవించాలనే ఉద్దేశంతోనే సీఎం కేసీఆర్ డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పథకాలు అమలుచేస్తున్నారని వివరించారు.
ఇంతటి మహత్తరమైన పథకాలను గమనించి ప్రజలందరూ సీఎం కేసీఆర్కు జేజేలు పలుకుతున్నారని వివరించారు. అందుకని ఆయనను మూడోసారి కూడా ముఖ్యమంత్రిగా ఆశీర్వదించాలని పిలుపునిచ్చారు. అనంతరం పాతకమలాపురం అంగన్వా డీ కేంద్రాన్ని సందర్శించి ఐసీడీఎస్ ద్వా రా చిన్నారులకు అందజేస్తున్న పౌష్టికాహారాన్ని పరిశీలించారు. మాలోత్ శకుంతల, రావూరి శ్రీనివాసరావు, తోటకూరి పిచ్చయ్య, ముత్యాల సత్యనారాయణ, పెద్దబోయిన ఉమాశంకర్, అడ్డగోడ ఐలయ్య, బానోత్ పద్మ, ఉమారాణి, పాండ్యానాయక్, బానోత్ కుమార్, ప ప్పుల నిర్మల, ఎండీ హనీఫ్, సురేశ్కుమార్, ఎం.చంద్రశేఖర్ పాల్గొన్నారు.