ఖమ్మం సిటీ/ రఘునాథపాలెం, డిసెంబర్ 25: జనవరి 8న హైదరాబాద్లో జరుగనున్న టీయూడబ్ల్యూజే (టీజేఎఫ్) రాష్ట్ర మహాసభకు ఉమ్మడి జిల్లా నుంచి జర్నలిస్టులు తరలి రావాలని యూనియన్ జిల్లా అధ్యక్షుడు ఆకుతోట ఆదినారాయణ కోరారు. నగరంలోని శ్రీ కవిత డిగ్రీ, పీజీ కళాశాలలో జిల్లా ప్రధాన కార్యదర్శి చిర్రా రవి అధ్యక్షతన యూనియన్ జిల్లా విస్తృత కార్యవర్గ సమావేశం ఆదివారం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఖమ్మంలోని జర్నలిస్టులందరికీ ఇండ్ల స్థలాలు, ఇండ్లు ఇప్పించి మిగతా వారందరికీ రోల్ మోడల్గా నిలుస్తానని ప్రకటించిన మంత్రి పువ్వాడ అజయ్కుమార్కు ఎప్పటికీ రుణపడి ఉంటామని అన్నారు.
అనంతరం టీయూడబ్ల్యూజే (టీజేఎఫ్), టెంజూ విస్తృత కమిటీలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్షుడుగా ఆకుతోట ఆదినారాయణ, ప్రధాన కార్యదర్శిగా చిర్రా రవి, కోశాధికారిగా కిరణ్, డిఫ్యూటీ జనరల్ సెక్రటరీగా మందటి వెంకటరమణ, ఉపాధ్యక్షులుగా సాంబశివరావు, శ్రీనివాసరావు, ప్రశాంత్రెడ్డి, హరీశ్బాబు, విజేత, చక్రవర్తి, సత్యనారాయణ, నాగార్జునతోపాటు సహాయ కార్యదర్శులు, ఈసీ సభ్యులను, ఎలక్ట్రానిక్ విభాగ కమిటీని ఎన్నుకున్నారు.