ఖమ్మం: ప్రయాణీకుల సౌకర్యార్ధం ఖమ్మం నుంచి శ్రీకాకుళంకు నూతన సర్వీసును సోమవారం నుంచి ప్రారంభించామని ఆర్టీసీ ఖమ్మం డిపో మేనేజర్ డి.శంకర్రావు మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఖమ్మం బస్ స్టేషన్ నుంచి శ్రీకాకుళం వరకు ప్రతి రోజు రాత్రి 7 గంటలకు సర్వీస్ నెంబర్ 8829 సూపర్ లగ్జరీ బస్సు బయలుదేరుతుందని, అదేవిధంగా శ్రీకాకుళం నుంచి ఖమ్మం వరకు ప్రతి రోజూ రాత్రి 7గంటలకు సర్వీస్ నెంబర్ 9930 బస్సు బయలుదేరుతుందని, ప్రయాణీకులు ఈ సర్వీసును ఆదరించాలని ఆయన పేర్కొన్నారు.
సుశిక్షితులైన వృత్తి నైపుణ్యం కలిగిన డ్రైవర్లతో నడుపుతున్న ఆర్టీసీ బస్సుల్లోనే సురక్షితమైన,సుఖవంతమైన ప్రయాణం ఉంటుందని అందుకోసమే ఆర్టీసి బస్సుల్లోనే ప్రయాణించాలని ఆయన ప్రయాణీకులకు సూచించారు.