పెనుబల్లి: టీఆర్ఎస్ పార్టీ పెనుబల్లి మండల మహిళా విభాగాన్ని ఏకగ్రీవంగా ఎంపిక చేశారు. అధ్యక్షురాలిగా మండలపరిధిలోని పాతకారాయిగూడెం గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ తేళ్లూరి భారతమ్మ, కార్యదర్శిగా వీయం బంజరుకు చెందిన ఇస్లావత్ శైలజ, మండాలపాడుకు చెందిన ఏట్కూరి కృష్ణవేణి ఉపాధ్యక్షురాలిగా, తాళ్ళపెంటకు చెందిన షేక్ రాజా ఖుదాన్బీ సంయుక్త కార్యదర్శిగా, కోశాధికారిగా గంగదేవిపాడుకు చెందిన భారతి లక్ష్మీతిరుపతమ్మలతో పాటు మరో నలుగురితో కమిటీని మంగళవారం ఏకగ్రీవంగా ఎంపిక చేశారు.
టీఆర్ఎస్ పార్టీ చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు ప్రజల్లోకి తీసుకెళ్ళేందుకు నూతన కమిటీ చొరవ చూపాలని మండల పార్టీ అధ్యక్షుడు కనగాల వెంటకరావు సూచించారు. తమపై నమ్మకంపై ఏకగ్రీవంగా ఎంపిక చేసినందుకు నూతన కమిటీ బాధ్యులు మండల కమిటీకి కృతజ్ఞతలు తెలిపారు.