మామిళ్లగూడెం, మార్చి 21 : వృత్తి నైపుణ్యాన్ని మరింత పెంపొందించేందుకు ట్రైనీ కానిస్టేబుళ్లకు తొమ్మిది నెలల శిక్షణ చాలా కీలకమైనదని పోలీస్ కమిషనర్ సునీల్ దత్ అన్నారు. గురువారం పోలీస్ శిక్షణ కేంద్రాన్ని సందర్శించిన సీపీ ఫైరింగ్ రేంజ్లో సిబ్బందికి ఇస్తున్న ఫైరింగ్ ప్రాక్టీస్ శిక్షణను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల ఉజ్వల భవిష్యత్కు సుదీర్ఘ కాలంపాటు సగర్వంగా అందించబోయే సేవలకు శిక్షణ ఎంతో అవసరమన్నారు. ఇందుకోసం కావాల్సిన శక్తి సామర్థ్యాలను, నిబద్ధతను శిక్షణలో మీకు వివరంగా నేర్పిస్తామని, తమ లక్ష్యాలను నెరవేర్చుకోవడానికి అంకితభావంతో ముందుకు వెళ్తూ.. పోలీసు శాఖకు పేరు ప్రఖ్యాతలు తీసుకొస్తారని విశ్వసిస్తున్నామన్నారు. కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ గణేశ్, ఏసీపీ రవి, ఏఆర్ ఏసీపీ నర్సయ్య, ఆర్ఐలు తిరుపతి, అప్పలనాయుడు, నాగుల్మీరా పాల్గొన్నారు.