ఇల్లెందు, జనవరి 10: ఇల్లెందు నియోజకవర్గ చరిత్రలో ఇదే మొట్టమొదటి జాబ్మేళా అని ఎమ్మెల్యే బానోత్ హరిప్రియానాయక్ అన్నారు. హైదరాబాద్కు చెందిన పలు కంపెనీలు హరిప్రియ ఫౌండేషన్ (ప్రజాభవన్) ఆధ్వర్యంలో ఇల్లెందులో మంగళవారం జాబ్మేళా నిర్వహింయి. ఈ సందర్భంగా ఆప్టెక్ ఫైబర్ అనే కంపెనీకి ఎంపికైన అభ్యర్థులకు ఆమె తన క్యాంపు కార్యాలయంలో ఆఫర్ లెటర్లను అందించి అభినందనలు తెలిపారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. నియోజకవర్గంలో నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ సహకారంతో ముందుకెళ్తున్నట్లు చెప్పారు. ఇక్కడి యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రజాభవన్ కేంద్రంగా హరిప్రియ ఫౌండేషన్ నిత్యం కృషి చేస్తుందని అన్నారు. జాబ్మేళాకు వచ్చిన యువత ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కలర్స్ స్కై టెక్నాలజీ ఎండీ నేహా బండారి, కంపెనీ ప్రతినిధులు శ్యాంలాల్, అవినాశ్, కిరణ్, బీఆర్ఎస్ నాయకులు పరుచూరి వెంకటేశ్వర్లు, ఎంటెక్ మహేందర్, గిన్నారపు రాజేష్, ఘాజీ తదితరులు పాల్గొన్నారు.