రుద్రంపూర్/ మణుగూరు టౌన్, జూన్ 25: అపరిష్కృతంగా ఉన్న తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ కోలిండియా ఆఫీసర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో కొత్తగూడెం, మణుగూరు ఏరియా జీఎం కార్యాలయాల ఎదుట నల్లబ్యాడ్జీలు ధరించి, ప్లకార్డులతో గురువారం నిరసన తెలిపారు.
ఈ సందర్భంగా సీఎంవోఏఐ నాయకులు మాట్లాడుతూ శ్రమకు తగిన వేతనాలు చెల్లించాలని, వేతన పెంపు అమలు, పెర్ఫార్మెన్స్ రిలేటెడ్ పే చెల్లింపును అమలు చేయాలని డిమాండ్ చేశారు. పెండింగ్లో ఉన్న రెండేళ్ల పీఆర్సీ బకాయిలు చెల్లించాలని, 2017 వేతన సవరణ నష్టాన్ని సవరించి కోలిండియాలో అమలు చేస్తున్న పే అప్గ్రేడేషన్ను సింగరేణిలో అమలు చేయాలని కోరారు. కార్యక్రమంలో సీఎంవోఏఐ నాయకులు మదన్నాయక్, మధుబాబు, రమేశ్, సురేశ్ పాల్గొన్నారు.