ఖమ్మం సిటీ, డిసెంబర్ 28: ఖమ్మం సర్దార్ పటేల్ స్టేడియంలో పువ్వాడ ప్రీమియర్ లీగ్ (పీపీఎల్) 20-20 క్రికెట్ పోటీలు కోలాహలంగా సాగుతున్నాయి. రెండు రోజులుగా జరుగుతున్న లీగ్ మ్యాచ్లో వివిధ జట్లకు సంబంధించిన క్రీడాకారులు పోటీపడి ఆడుతున్నారు. సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి వరకు ఫ్లడ్ లైట్ల వెలుగుల్లో సాగుతున్న పోటీలను తిలకించేందుకు ఖమ్మం ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నరు. కాగా, బుధవారం తొలి మ్యాచ్ బాలాజీ ఎస్టేట్స్, మ్యాక్స్కేర్ ఆసుపత్రి జట్లు తలపడ్డాయి.
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న బాలాజీ ఎస్టేట్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 183 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్కు దిగిన మ్యాక్స్కేర్ జట్టు కేవలం 83 పరుగులకే ఆలౌట్ కావడంతో బాలాజీ ఎస్టేట్స్ జట్టు 100 పరుగుల ఆధిక్యంతో గెలుపొందింది.