ఖమ్మం ఎడ్యుకేషన్, మార్చి 11 : ఎన్జీసీ(నేషనల్ గ్రీన్ కార్ప్స్) ఆధ్వర్యంలో నగరంలోని సైన్స్ మ్యూజియం ఆవరణలో సోమవారం నిర్వహించిన జిల్లాస్థాయి సైన్స్ ప్రదర్శనలో తల్లంపాడు జడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థులు మొదటి బహుమతి సాధించారు. బెస్ట్ అవుట్ ఆఫ్ వేస్ట్ ఇతివృత్తంతో సాగిన ప్రదర్శనలో వ్యర్థ్ధాలను సద్వినియోగపరుచుకునేలా తీర్చిదిద్దారు. సైన్స్ టీచర్ తంగెళ్లపల్లి ఉష విద్యార్థులను మోటివేషన్ చేసిన తీరును డీఈవో సోమశేఖర శర్మ అభినందించారు. కార్యక్రమంలో డీసీఈబీ సెక్రటరీ నారాయణ, దుస్సా జగదీశ్వర్, ఇనుముల వెంకటేశ్వర్లు, ఎం.రాజశేఖర్, ఐలయ్య, శ్రీనివాస్, యాకుబ్, రంజిత్కుమార్ పాల్గ్గొన్నారు.