నేలకొండపల్లి, ఫిబ్రవరి 1:మండలంలో చేపడుతున్న కంటివెలుగు పరీక్షల కేంద్రాలను ప్రజలు వినియోగించుకోవాలని ఎంపీడీవో జమలారెడ్డి తెలిపారు. నేలకొండపల్లి, బోదులబండ గ్రామాల్లోని కంటి పరీక్షల కేంద్రాలను ఆయన సందర్శించి మాట్లాడారు. కార్యక్రమంలో డాక్టర్లు గీత, మణిబాబు, రాధాకృష్ణ, పీహెచ్ఎన్లు దుర్గా, వాణి, సిబ్బంది పాల్గొన్నారు.
మధిరరూరల్, ఫిబ్రవరి1 : ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన కంటి వెలుగు శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని సర్పంచ్ శివనాగకుమారి అన్నారు. బుధవారం మాటూరుపేటలో కంటి వెలుగు శిబిరాన్ని ప్రారంభించి మాట్లాడారు. కార్యక్రమంలో ఎంపీడీవో విజయభాస్కర్రెడ్డి, కంటి వెలుగు శిబిరం ఇన్చార్జి డాక్టర్ సంగెపు గోపి, ప్రభుత్వ హాస్పిటల్ సూపర్వైజర్ భాస్కర్రావు, పంచాయతీ కార్యదర్శి ఐలూరి నరేందర్రెడ్డి, వెలుగు సీసీ మేడూరి మురళీకృష్ణ పాల్గొన్నారు.
చింతకాని, ఫిబ్రవరి 1 : కంటివెలుగు వైద్యశిబిరాలను ప్రజలందరూ వినియోగించుకోవాలని ఖమ్మం జిల్లా క్షయనివారణ అధికారి, కంటివెలుగు పోగ్రాం అధికారి వరికూటి సుబ్బారావు అన్నారు. పందిళ్ళపల్లి, కొదుమూరు తదితర గ్రామాల్లో ఏర్పాటు చేసిన కంటి వెలుగు శిబిరాలను ఆకస్మికంగా తనిఖీచేసి సిబ్బందికి సూచనలు చేశారు. కార్యక్రమంలో అధికారులు, ప్రజాప్రతినిధులు, వైద్యసిబ్బంది పాల్గొన్నారు.