రఘునాథపాలెం మండలం కోయచలక గ్రామంలో జరుగుతున్న అభివృద్ధి అన్ని గ్రామాలకూ
ఆదర్శంగా నిలుస్తోందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ పేర్కొన్నారు.
కోయచలకలో రూ.58 లక్షలతో చేపట్టిన పలు రకాల అభివృద్ధి పనులను మంత్రి అజయ్కుమార్ ఆదివారం ప్రారంభించారు. మరో రూ.10 లక్షలతో నిర్మించనున్న ప్రభుత్వ పాఠశాల అదనపు తరగతి గదికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. గతంలో ఎన్నడూ జరుగని అభివృద్ధి ఎనిమిదేళ్లలోనే జరిగిందని స్పష్టం చేశారు. గడిచిన మూడేళ్ల కాలంలోనే కోయచలక అభివృద్ధి కోసం రూ.5.14 కోట్లు కేటాయించినట్లు వివరించారు.
-రఘునాథపాలెం, డిసెంబర్ 4
రఘునాథపాలెం, డిసెంబర్ 4: కోయచలక అభివృద్ధి రఘునాథపాలెం మండలానికి ఆదర్శమని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పేర్కొన్నారు. కోయచలక గ్రామంలో రూ.58 లక్షలతో చేపట్టిన పలు రకాల అభివృద్ధి పనులను మంత్రి అజయ్కుమార్ ఆదివారం ప్రారంభించారు. అంతేగాక రూ.10 లక్షలతో నిర్మించనున్న ప్రభుత్వ పాఠశాల అదనపు తరగతి గది నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. గతంలో ఎన్నడూ జరుగని అభివృద్ధి ఈ ఎనిమిదేళ్ల కాలంలోనే జరిగిందని స్పష్టం చేశారు. గడిచిన మూడేళ్ల కాలంలోనే కోయచలక అభివృద్ధి కోసం రూ.5.14 కోట్లు కేటాయించినట్లు వివరించారు. అంతేగాక సంక్షేమం కోసం రూ.9.02 కోట్లు అందించినట్లు చెప్పారు. ఒక్క గ్రామానికే ఇంత పెద్ద మొత్తంగా నిధులు రావడం స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి ఎప్పుడూ జరగలేదని అన్నారు. రఘునాథపాలెం మండలంలోని అన్ని గ్రామాల్లోనూ సీసీ రోడ్లు వేసుకోగలిగామని, ఆఖరికి డొంకదారులను సైతం పూర్తి చేసుకున్నామని వివరించారు. మన అభివృద్ధి ఇతర రాష్ర్టాలకు ఆదర్శంగా నిలుస్తోందన్నారు.
మంగళవారం నిజామాబాద్ కలెక్టర్, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, ఎమ్మెల్యేలు, మున్సిపల్ అధికారులు ఖమ్మం అభివృద్ధిని చూసేందుకు వస్తున్నట్లు తెలిపారు. ఇలా ఖమ్మానికి కీర్తి లభించడానికి ప్రభుత్వ సహకారమే కారణమని అన్నారు. రూ.53 కోట్లతో వీ వెంకటాయపాలెంలో అద్భుతమైన కలెక్టరేట్ను నిర్మించుకున్నామని అన్నారు. అనంతరం గ్రామానికి మంజూరైన ఆసరా పింఛన్ల గుర్తింపు కార్డులను పంపిణీ చేశారు. సర్పంచ్ మాదంశెట్టి హరిప్రసాద్ అద్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, టీఆర్ఎస్ నాయకులు లక్ష్మీప్రసన్న, గుత్తా రవి, విద్యాచందన, నర్సింహారావు, వాణీశ్రీ, ఆదిత్యరాజ్, పూర్ణచందర్రావు, మందడపు నర్సింహారావు, మద్దినేని వెంకటరమణ, పిన్ని కోటేశ్వరరావు, లక్ష్మణ్నాయక్, అజ్మీరా వీరూనాయక్, బోయినపల్లి లక్ష్మణ్గౌడ్, చెరుకూరి భిక్షమయ్య, మందడపు సుధాకర్, కొర్లపాటి రామారావు, నున్నా శ్రీనివాసరావు, నున్నా వెంకటేశ్వరరావు, తోట వెంకట్, బలుసుపాటి సుజాత, నాగేశ్వరరావు, దొంతు సత్యనారాయణ, గొర్రె శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.