ఎర్రుపాలెం : తెలంగాణ చిన్నతిరుపతిగా పేరుగాంచిన జమలాపురం శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయంలో శనివారం భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అర్చకులు ఉప్పల శ్రీనివాసశర్మ, రాజీవ్శర్మ ఆధ్వర్యంలో తెల్లవారుజామున ఘనంగా పంచామృతాలతో సర్వాంగాభిషేకం నిర్వహించారు. మంగళవాయిదాల నడుమ ఆలయ తలుపులు తెరిచి పూజలు నిర్వహించారు. అభిషేకం అనంతరం పట్టువస్త్రాలతో ప్రత్యేక అలంకరణ చేశారు. శ్రావణమాసంలో చివరి శనివారం కావడంతో వేలాదిగా తరలివచ్చి స్వామివారిని దర్శించుకొని మొక్కులు తీర్చుకున్నారు.
స్వామివారిని, అమ్మవార్లను మేళతాళాలతో మంగళవాయిద్యాతలో పల్లకిలో కళ్యాణవేదిక వద్దకు అర్చకులు తీసుకువచ్చారు. భక్తులు పాలపొంగళ్లు చేసి స్వామివారికి నివేదించారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ ఉప్పల కృష్ణమోహనశర్మ, ఈవో జగన్మోహన్రావు, సూపరిండెంట్ శ్రీనివాస్, సీనియర్ అసిస్టెంట్ కే.విజయకుమారి, ఆలయ అర్చకులు, సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు.