కొత్తగూడెం సింగరేణి, జనవరి 4: సింగరేణి ఈ ఆర్థిక సంవత్సరం డిసెంబర్ ముగిసిన నాటికి (మూడో త్రైమాసికం) ఆల్టైం రికార్డుగా రూ.23,225 కోట్ల టర్నోవర్ సాధించిందని సీఎండీ శ్రీధర్ బుధవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. గత ఆర్థిక సంవత్సరం ఇదే సమయానికి టర్నోవర్ రూ.18,956 కోట్లు మాత్రమే ఉందన్నారు.
గతేడాది కంటే ఈసారి 23 శాతం ఎక్కువ టర్నోవర్ సాధించామన్నారు. ఈ ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి టర్నోవర్ రూ.34 వేల కోట్లకు చేరుకునే అవకాశం ఉందన్నారు.