ఖమ్మం : ఖమ్మం నగరం పాండురంగాపురంలోని శ్రీసీతారామాలయంలో నూతనంగా నిర్మించిన శ్రీమహాలక్ష్మీ ఆలయంలో విగ్రహాల ప్రతిష్ఠామహోత్సవం సోమవారం అత్యంత వైభంగా జరిగింది. ఈ కార్యక్రమాన్ని కనులారా తిలకించేందుకు పాండురంగాపురం, బల్లేపల్లి, జయనగర్ కాలనీలతో పాటు ఖమ్మం నగరం చుట్టు పక్కల ప్రాంతాలకు చెందిన భక్తులు వేలాదిగా తరలివచ్చారు. విగ్రహాల ప్రతిష్ట, ద్వజస్థంభ ప్రతిష్ట సందర్భంగా ఆలయ ప్రాంగణం వేధపండితుల మంత్రోశ్చరణతో మారుమ్రోగింది.
ద్వజస్తంభం ప్రతిష్ఠ సమయంలో ఆలయ ప్రాంగణం గోవిందనామస్మరణతో మారుమ్రోగింది. ముందుగా ఆలయంలో అమ్మవారి సింహవాహనం, ద్వజ స్తంభాలను వేదపండితులు మంత్రోచ్చరణల నడుమ అంగరంగ వైభవంగా జరిగింది. ఆలయ ప్రతిష్ఠ సందర్భంగా పాండురంగాపురం కాలనీ బంధువుల రాకతో సందడి కనిపించింది. ఆలయ ప్రతిష్ఠా కార్యక్రమానికి రాష్ట్ర రవాణాశాఖా మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ముఖ్య అతిధిగా పాల్గొని ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు.