ఖమ్మం సిటీ, డిసెంబర్ 20: జాతీయస్థాయి వాలీబాల్ పోటీల్లో రాణించి తల్లిదండ్రులకు, పాఠశాలకు, జిల్లాకు పేరు ప్రఖ్యాతులు తీసుకురావాలని రాష్ట్ర మార్కెటింగ్ శాఖ డైరెక్టర్ లక్ష్మీభాయి ఆకాంక్షించారు. ఖమ్మం ఏఎంసీ సందర్శనకు ఇటీవల వచ్చిన ఆమె.. రైతుబజార్ను సందర్శిస్తున్న క్రమంలో అదే రైతుబజార్ ఇన్చార్జిగా విధులు నిర్వహిస్తున్న జీడీ ఉపేందర్ ఆమెకు తన కుమార్తె హన్సినిని పరిచయం చేశారు.
తన కుమార్తె జాతీయస్థాయి అండర్-14 వాలీబాల్ పోటీలకు ఎంపికైనట్లు చెప్పారు. దీంతో సదరు క్రీడాకారిణిని డైరెక్టర్ లక్ష్మీభాయి ప్రత్యేకంగా అభినందించారు. చదువుతోపాటు క్రీడల్లోనూ రాణించాలని సూచించారు. క్రీడాకారిణి హన్సినికి మార్కెటింగ్ శాఖ అధికారులు, ఉద్యోగ సంఘాల నాయకులు అలీమ్, మల్లేశం, కిరణ్, నరేశ్, వజీర్, ఆంజనేయులు అభినందనలు తెలిపారు.