సత్తుపల్లి రూరల్/ వేంసూరు, మార్చి 31:తెలంగాణలో కేసీఆరే మళ్లీ సీఎం అవుతారని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య స్పష్టం చేశారు. అభివృద్ధికి చిరునామాగా రాష్ర్టాన్ని తీర్చిదిద్దారని అన్నారు. సత్తుపల్లి, వేంసూరు మండలాల్లో శుక్రవారం పర్యటించిన ఆయన.. ఈ నెల 2, 3 తేదీల్లో జరిగే ఆత్మీయ సమ్మేళనాలను విజయవంతం చేయాలని కోరుతూ ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి పనులను శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. తొలుత సత్తుపల్లి మండలం బేత్తుపల్లిలో పర్యటించిన ఆయన.. ప్రతి ఇంటికీ వెళ్లి యజమానులను పలుకరించారు. ఈ నెల 2న గంగారంలో జరిగే ఆత్మీయ సమ్మేళనానికి హాజరుకావాలంటూ ఆహ్వానపత్రాలు అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అభివృద్ధి, సంక్షేమంలో తెలంగాణ దేశానికే రోల్మోడల్గా నిలిచినప్పటికీ ప్రతిపక్షాలు అర్థంలేని విమర్శలు చేస్తున్నాయని మండిపడ్డారు. యావత్ దేశమూ తెలంగాణ వైపే చూస్తోందని అన్నారు. కార్యకర్తలే బీఆర్ఎస్కు బలమని, ప్రతి కార్యకర్తా ఓ కేసీఆర్లా మారాలని పిలుపునిచ్చారు. ఆత్మీయ సమ్మేళనాలకు ప్రతి ఇంటి నుంచీ పెద్ద ఎత్తున ప్రజలు తరలిరావాలని కోరారు. వేంసూరు మండలం బీరాపల్లిలో ఏప్రిల్ 3న సమ్మేళనానికి మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి, ఆదివారం గంగారంలో జరిగే సమ్మేళనానికి మంత్రి అజయ్కుమార్, ఎంపీలు నామా నాగేశ్వరరావు, వద్దిరాజు రవిచంద్ర, బండిపార్థసారథిరెడ్డి, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఎమ్మెల్సీ తాతా మధు హాజరవుతారని తెలిపారు.
వేంసూరు మండలంలో పర్యటించిన ఎమ్మెల్యే సండ్ర.. భరణిపాడులో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ‘మన ఊరు – మన బడి’ లో భాగంగా రూ.14 లక్షలతో తీర్చిదిద్దిన భరణిపాడు ప్రాథమిక పాఠశాలను ఆయన ప్రారంభించారు. సదుపాయాల గురించి విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. రూ.20 లక్షలతో నిర్మించనున్న సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. రూ.25 లక్షల సింగరేణి సేఫ్ నిధులతో నిర్మించనున్న ఎస్సీ కమ్యూనిటీ హాల్కు శంకుస్థాపన చేశారు. అనంతరం కంటి వెలుగు శిబిరాన్ని సందర్శించారు. తరువాత మారెమ్మతల్లి వార్షికోత్సవంలో పాల్గొని ప్రత్యేక పూజలు చేసి అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కల్లూరుగూడెంలో ఏర్పాటు చేసుకుంటున్న పామాయిల్ ఫ్యాక్టరీ నిర్మాణ పనులను ఏప్రిల్ 3న మంత్రి నిరంజన్రెడ్డి పరిశీలిస్తారని అన్నారు.
ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ నాయకులు, అధికారులు కొత్తూరు ఉమామహేశ్వరరావు, దొడ్డా హైమావతి, వనమా వాసు, కూసంపూడి రామారావు, యాగంటి శ్రీను, దొడ్డా శంకర్రావు, శీలపురెడ్డి హరికృష్ణారెడ్డి, మందపాటి శ్రీనివాసరెడ్డి, వేల్పుల కళావతి, పాకలపాటి శ్రీనివాసరావు, మోదుగు పుల్లారావు, పగుట్ల వెంకటేశ్వరరావు, రమేశ్, రంజిత్కుమార్, చలంచర్ల వెంకటేశ్వరరావు, హేమలత, రమేశ్కుమార్, ప్రకాశ్, వాసు, పుచ్చకాయల శంకర్రెడ్డి, పాల వెంకటరెడ్డి, కంటే వెంకటేశ్వరరావు, మందపాటి సునీత, మందపాటి మహేశ్వరరెడ్డి, నాని, వెంకటకృష్ణారెడ్డి, మారోజు సురేశ్, మద్దిరెడ్డి పుల్లారెడ్డి, గొర్ల ప్రభాకర్రెడ్డి, మందపాటి వేణుగోపాల్రెడ్డి, గండ్ర సోమిరెడ్డి, బొంతు రామారావు, గొర్ల శ్రీనివాసరెడ్డి, నున్నా రాంబాబు తదితరులు పాల్గొన్నారు.