వేంసూరు, మార్చి 23 : అకాల వర్షాల కారణంగా పంటలు నష్టపోయిన రైతులెవరూ అధైర్యపడొద్దని, ప్రభుత్వం అన్ని విధాల ఆదుకుంటుందని ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అన్నారు. రాయుడుపాలెం, మర్లపాడు గ్రామాల్లో అకాల వర్షాల కారణంగా దెబ్బతిన్న మొక్కజొన్న పంటను గురువారం పరిశీలించి మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వ లోపాల కారణంగా రైతులకు న్యాయం జరగడం లేదని, నష్టపోయిన రైతులకు కేంద్రం అందించే బీమా కంటితుడుపు మాత్రమేనన్నారు. పంట సాగు చేస్తున్న కౌలు రైతుకు సైతం ఈ పరిహారం అందుతుందని తెలిపారు. కార్యక్రమంలో ఎంపీపీ పగుట్ల వెంకటేశ్వరరావు, పార్టీ అధ్యక్షుడు పాల వెంకటరెడ్డి, కార్యదర్శి కంటే వెంకటేశ్వరరావు, సీడీసీ డైరెక్టర్ పుచ్చకాయల శంకర్రెడ్డి, ఎంపీటీసీ గొర్ల శ్రీనివాసరెడ్డి, నాయకులు దొడ్డా వెంకటకృష్ణారెడ్డి, మారోజు సురేశ్, దొడ్డా చిన్నకేశవరెడ్డి, సర్పంచ్లు మందపాటి వేణుగోపాల్రెడ్డి, ఎం.డీ.ఫైజుద్దీన్, షేక్ నాగుల్మీరా, ఏవో కే.రామ్మోహన్, ఏఈవోలు పాల్గొన్నారు.
బస్టాండ్కు ఫ్లాట్ఫామ్లు కేటాయించాలి ఎమ్మెల్యేకు డీఎం రాజ్యలక్ష్మి వినతి
సత్తుపల్లి టౌన్, మార్చి 23 : పట్టణంలోని బస్టాండ్కు అదనపు ప్లాట్ఫామ్లు కేటాయించాలని డిపో మేనేజర్ రాజ్యలక్ష్మి గురువారం ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్యను కలిసి వినతిపత్రం అందజేశారు. బస్టాండ్లో నెలకొన్న అసౌకర్యాల గురించి ఆమె సండ్ర దృష్టికి తీసుకువెళ్లారు. ఆమె వెంట స్టేషన్ మాస్టర్ శ్రీనివాసరావు, కిన్నెర ఆనంద్ తదితరులు ఉన్నారు.
బాధిత కుటుంబానికి ఎమ్మెల్యే పరామర్శ
తల్లాడ, మార్చి 23 : పాతమిట్టపల్లి గ్రామానికి చెందిన మేడి సునీత ఇటీవల మృతిచెందింది. ఆమె కుటుంబ సభ్యులను ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య గురువారం పరామర్శించారు. కార్యక్రమంలో ఎంపీపీ దొడ్డా శ్రీనివాసరావు, ఎంపీటీసీ కోపిల కనకయ్య, కొండపల్లి శేఖర్బాబు, నాయుడు శ్రీనివాసరావు, శెట్టిపల్లి లక్ష్మణరావు, జంగా వెంకట్రెడ్డి, మేడి నాగేశ్వరరావు, రాంబాబు తదితరులు పాల్గొన్నారు.