ఖమ్మం ఎడ్యుకేషన్, ఫిబ్రవరి 22 : పదో తరగతి వార్షిక పరీక్షలు దగ్గర పడుతున్న నేపథ్యంలో విద్యార్థులు కష్టపడి చదివితేనే మంచి ఫలితం ఉంటుందని వరంగల్ ఆర్జేడీ సత్యనారాయణరెడ్డి అన్నారు. నగరంలోని నయాబజార్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలను గురువారం తనిఖీ చేసిన ఆయన ఉపాధ్యాయుల హాజరు, మధ్యాహ్న భోజన నాణ్యతను పరిశీలించారు.
అనంతరం పదో తరగతి విద్యార్థులతో మాట్లాడారు. పదో తరగతి విద్యార్థులు వంద శాతం ఉత్తీర్ణత సాధించేలా ఉపాధ్యాయులు దృష్టి సారించాలన్నారు. ఉదయం, సాయంత్రం అదనపు సమయాలతోపాటు ఆదివారాల్లో కూడా విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించాలని హెచ్ఎం నర్సింహారెడ్డికి సూచించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు పాల్గొన్నారు.