భద్రాద్రి కొత్తగూడెం, మే 7 (నమస్తే తెలంగాణ) : జిల్లాకు కేటాయించిన బ్యాలెట్ యూనిట్ల ర్యాండమైజేషన్ ప్రక్రియ పూర్తి చేసినట్లు కలెక్టర్, ఎన్నికల అధికారి ప్రియాంక ఆల తెలిపారు. జిల్లాకు కేటాయించిన 344 బ్యాలెట్ యూనిట్లకు రాజకీయ పార్టీ నాయకుల సమక్షంలో ర్యాండమైజేషన్ పూర్తి చేశామని తెలిపారు. మంగళవారం కలెక్టరేట్లో జరిగిన సమావేశంలో ఎలక్షన్ సెల్ దారా ప్రసాద్, డిప్యూటీ తహసీల్దార్ రంగా ప్రసాద్, ఎన్ఐసీ సుశీల్, ఎలక్షన్ సెల్ సిబ్బంది నవీన్, కాంగ్రెస్ పార్టీ నుంచి లక్ష్మణ్ అగర్వాల్, బీజేపీ నుంచి నోముల రమేశ్, బీఎస్పీ నుంచి ఆనందరావు, సీపీఎం నుంచి సత్యనారాయణ పాల్గొన్నారు.