నేలకొండపల్లి, జనవరి 10: మండలంలోని మంగాపురంతండాకు చెందిన కబడ్డీ క్రీడాకారులు అంతర్జాతీయ కబడ్డీ పోటీల్లో రెండోవ స్థానంలో నిలిచారు. నేపాల్ యూత్ గేమ్స్ కౌన్సిల్ ఆధ్వర్యంలో ఇండో నేపాల్ ఇంటర్నేషనల్ సిరీస్ 2023ను ఈనెల 6 నుంచి 10వ తేదీ వరకు నేపాల్లోని పోకరా స్టేడియంలో నిర్వహించారు. గ్రామానికి చెందిన భూక్యా నవీన్, గణేశ్, సాకేత్, బార్గవ్, ఉదయ్, నవనీత్కుమార్, గోపి, జానకిరామ్ పాల్గొన్నారు.
ఈ పోటీల్లో రెండవ స్థానంలో నిలిచిన వారికి యూత్ గేమ్స్ కౌన్సిల్ ఇండియా కార్యదర్శి అమర్ చేతుల మీదుగా కప్పును అందుకున్నారు. అదే విధంగా ఒక్కొక్క క్రీడాకారునికి ప్రత్యేకంగా షీల్డ్ అందజేశారు. గ్రామ సర్పంచ్ భూక్యా సుధాకర్, తల్లిదండ్రులు, గ్రామస్తులు వారిని అభినందించారు.