పర్ణశాల, డిసెంబర్ 21 : ముక్కోటి ఉత్సవాల్లో భాగంగా ప్రముఖ పుణ్యక్షేత్రమైన పర్ణశాల దేవాలయంలో గురువారం శ్రీకృష్ణ అవతారంలో పర్ణశాల రామయ్య భక్తులకు దర్శనమిచ్చారు. అర్చకులు ఈ అవతారం గురించి భక్తులకు వివరించారు. కార్యక్రమంలో అర్చకులు శేష కిరణ్కుమారాచార్యులు, అమరవాది కిశోరాచార్యులు, భరద్వాజాచార్యులు, రాజగోపాలాచార్యులు, నరసింహాచార్యులు, ఏఈవో శ్రావణ్కుమార్, అనిల్, సూపరింటెండెంట్ కిశోర్, గుమస్తా ప్రసాద్, సిబ్బంది రాము, శివ, భక్తులు పాల్గొన్నారు.